ETV Bharat / international

ట్రంప్, బైడెన్ మధ్య రెండో డిబేట్​ రద్దు

అమెరికా ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల మధ్య జరగాల్సిన రెండో డిబేట్ రద్దయింది. అక్టోబర్ 15న జరగాల్సిన ఈ చర్చను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ట్రంప్, బైడెన్ ఆఖరి డిబేట్​లోనే అమీతుమీ తేల్చుకోనున్నారు.

author img

By

Published : Oct 10, 2020, 6:50 AM IST

Updated : Oct 10, 2020, 6:58 AM IST

President Donald Trump
ట్రంప్, బైడెన్ మధ్య రెండో సంవాదం రద్దు

అమెరికా ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే రెండో సంవాదం రద్దయింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగాల్సిన చర్చ జరగదని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్​(సీపీడీ) ప్రకటించింది. ఇరువురు అభ్యర్థులు ఆ తేదీల్లో 'ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రకటించారు' అని పేర్కొంది. కాబట్టి అక్టోబర్ 15న డిబేట్ జరగబోదని స్పష్టం చేసింది.

నిజానికి అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడు ముఖాముఖి చర్చలు జరగాలి. ఇప్పటికే ఒకటి ముగియగా.. అక్టోబర్ 15, అక్టోబర్ 22 తేదీల్లో మిగతా రెండు డిబేట్​లు నిర్వహించాలని ప్రణాళికలు వేశారు. రెండో డిబేట్ రద్దు కావడం వల్ల.. ఇరువురి మధ్య తుది​ సంవాదం మాత్రమే జరగనుంది.

ఒకరు ఓకే...

అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో రెండో ముఖాముఖిపై సందిగ్ధత తలెత్తింది. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండో డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలన్న కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌(సీపీడీ) నిర్ణయాన్ని ట్రంప్‌ వ్యతిరేకించారు. వర్చువల్‌గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడిన ఆయన‌.. 'వర్చువల్‌ పద్ధతిలో జరిగే డిబేట్‌లో పాల్గొని నా సమయాన్ని వృథా చేసుకోను. ఇది మాకు అంగీకారం కాదు' అని స్పష్టం చేశారు. బైడెన్‌ను రక్షించేందుకే సీపీడీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సీపీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.

మరోవైపు బైడెన్‌ మాత్రం వర్చువల్‌ డిబేట్‌కు సుముఖత వ్యక్తం చేశారు.

కమిషన్​ స్పందన...

ట్రంప్‌ వ్యాఖ్యలపై డిబేట్స్‌ కమిషన్‌ స్పందించింది. చర్చలో పాల్గొనే వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ఆలోచన లేదని.. డిబేట్‌ వర్చువల్‌గానే జరుగుతుందని ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తాజాగా తన నిర్ణయం మార్చుకొని.. డిబేట్​ను రద్దు చేసినట్లు ప్రకటించింది.

కరోనా వల్లే...

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా చర్చించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ డిబేట్‌లను సీపీడీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ట్రంప్​ శ్వేతసౌధంలో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు​. ఈ నేపథ్యంలో మిగతా రెండు చర్చలను వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది.

అమెరికా ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే రెండో సంవాదం రద్దయింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగాల్సిన చర్చ జరగదని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్​(సీపీడీ) ప్రకటించింది. ఇరువురు అభ్యర్థులు ఆ తేదీల్లో 'ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రకటించారు' అని పేర్కొంది. కాబట్టి అక్టోబర్ 15న డిబేట్ జరగబోదని స్పష్టం చేసింది.

నిజానికి అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడు ముఖాముఖి చర్చలు జరగాలి. ఇప్పటికే ఒకటి ముగియగా.. అక్టోబర్ 15, అక్టోబర్ 22 తేదీల్లో మిగతా రెండు డిబేట్​లు నిర్వహించాలని ప్రణాళికలు వేశారు. రెండో డిబేట్ రద్దు కావడం వల్ల.. ఇరువురి మధ్య తుది​ సంవాదం మాత్రమే జరగనుంది.

ఒకరు ఓకే...

అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో రెండో ముఖాముఖిపై సందిగ్ధత తలెత్తింది. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండో డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలన్న కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌(సీపీడీ) నిర్ణయాన్ని ట్రంప్‌ వ్యతిరేకించారు. వర్చువల్‌గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడిన ఆయన‌.. 'వర్చువల్‌ పద్ధతిలో జరిగే డిబేట్‌లో పాల్గొని నా సమయాన్ని వృథా చేసుకోను. ఇది మాకు అంగీకారం కాదు' అని స్పష్టం చేశారు. బైడెన్‌ను రక్షించేందుకే సీపీడీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సీపీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.

మరోవైపు బైడెన్‌ మాత్రం వర్చువల్‌ డిబేట్‌కు సుముఖత వ్యక్తం చేశారు.

కమిషన్​ స్పందన...

ట్రంప్‌ వ్యాఖ్యలపై డిబేట్స్‌ కమిషన్‌ స్పందించింది. చర్చలో పాల్గొనే వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ఆలోచన లేదని.. డిబేట్‌ వర్చువల్‌గానే జరుగుతుందని ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తాజాగా తన నిర్ణయం మార్చుకొని.. డిబేట్​ను రద్దు చేసినట్లు ప్రకటించింది.

కరోనా వల్లే...

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా చర్చించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ డిబేట్‌లను సీపీడీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ట్రంప్​ శ్వేతసౌధంలో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు​. ఈ నేపథ్యంలో మిగతా రెండు చర్చలను వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది.

Last Updated : Oct 10, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.