ETV Bharat / international

'సౌదీ యువరాజు ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య'

2018లో టర్కీలో హత్యకు గురైన జర్నలిస్టు ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు హస్తం ఉందని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సల్మాన్​ నియంతృత్వం సహా ఖషోగ్గి హత్య జరిగిన సమయంలో ఆ దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపాయి.

author img

By

Published : Feb 27, 2021, 8:00 AM IST

Updated : Feb 27, 2021, 8:38 AM IST

saudi prince, khashoggi
'సౌదీ యువరాజు ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య'

జర్నలిస్టు జమాల్​ ఖషోగ్గీ హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహమ్మద్​ బిన్ సల్మాన్​ ప్రధాన పాత్ర పోషించారని ఆఫీస్​ ఆఫ్ ది డైరెక్టర్​ ఆఫ్ నేషనల్​ ఇంటెలిజెన్స్ (ఓడీఎన్​ఐ)​ నివేదికలో పేర్కొంది. ఈనెల 11న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొంత భాగాన్ని చట్టసభలో శుక్రవారం అధికారులు బహిర్గతం చేశారు. సౌదీలో పాలన వ్యవస్థ, యువరాజు నియంతృత్వ ధోరణి, ఖషోగ్గి హత్య జరిగిన సమయంలో ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని స్పష్టం చేసింది.

"ఖషోగ్గీని టర్కీలో హత్య చేయమని సౌదీ యువరాజే ఆదేశాలు జారీ చేశారని మేము భావిస్తున్నాము. సౌదీలో యువరాజు సమ్మతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు. 2017 నుంచి ఆ దేశంలోని భద్రత, నిఘా వ్యవస్థలోని కార్యకలాపాలు సల్మాన్​ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. అప్పచెప్పిన పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయానక వాతావరణాన్ని సౌదీ అధికారులలో సల్మాన్ కల్పించారు.​ టర్కీలోని ఇస్తాంబుల్​లో ఖషోగ్గీని హత్య చేసిన రోజు (అక్టోబరు 2, 2018) ఆ ప్రాంతానికి 15 మంది సభ్యులున్న సౌదీ బృందం చేరుకుంది. వీరిలో ఏడుగురు సౌదీ యువరాజు వ్యక్తిగత భద్రత దళానికి చెందిన వారు. యువరాజు అనుమతి లేనిదే వీరు ఈ ఆపరేషన్​లో పాల్గొనరని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఈ హత్యలో సల్మాన్​ హస్తం ముమ్మాటికీ ఉంది."

-ఓడీఎన్​ఐ నివేదిక

ఖషోగ్గీ బ్యాన్​..

నివేదిక వెల్లడైన అనంతరం విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్​.. ఖషోగ్గీ బ్యాన్​ పేరున సౌదీకి చెందిన 76 మంది వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో స్థిరపడ్డ పలువురు సౌదీ కార్యకర్తలు, జర్నలిస్టులపై వీరు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : సిరియాకు సాయాన్ని రాజకీయం చేయొద్దు: భారత్​

జర్నలిస్టు జమాల్​ ఖషోగ్గీ హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహమ్మద్​ బిన్ సల్మాన్​ ప్రధాన పాత్ర పోషించారని ఆఫీస్​ ఆఫ్ ది డైరెక్టర్​ ఆఫ్ నేషనల్​ ఇంటెలిజెన్స్ (ఓడీఎన్​ఐ)​ నివేదికలో పేర్కొంది. ఈనెల 11న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొంత భాగాన్ని చట్టసభలో శుక్రవారం అధికారులు బహిర్గతం చేశారు. సౌదీలో పాలన వ్యవస్థ, యువరాజు నియంతృత్వ ధోరణి, ఖషోగ్గి హత్య జరిగిన సమయంలో ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని స్పష్టం చేసింది.

"ఖషోగ్గీని టర్కీలో హత్య చేయమని సౌదీ యువరాజే ఆదేశాలు జారీ చేశారని మేము భావిస్తున్నాము. సౌదీలో యువరాజు సమ్మతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు. 2017 నుంచి ఆ దేశంలోని భద్రత, నిఘా వ్యవస్థలోని కార్యకలాపాలు సల్మాన్​ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. అప్పచెప్పిన పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయానక వాతావరణాన్ని సౌదీ అధికారులలో సల్మాన్ కల్పించారు.​ టర్కీలోని ఇస్తాంబుల్​లో ఖషోగ్గీని హత్య చేసిన రోజు (అక్టోబరు 2, 2018) ఆ ప్రాంతానికి 15 మంది సభ్యులున్న సౌదీ బృందం చేరుకుంది. వీరిలో ఏడుగురు సౌదీ యువరాజు వ్యక్తిగత భద్రత దళానికి చెందిన వారు. యువరాజు అనుమతి లేనిదే వీరు ఈ ఆపరేషన్​లో పాల్గొనరని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఈ హత్యలో సల్మాన్​ హస్తం ముమ్మాటికీ ఉంది."

-ఓడీఎన్​ఐ నివేదిక

ఖషోగ్గీ బ్యాన్​..

నివేదిక వెల్లడైన అనంతరం విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్​.. ఖషోగ్గీ బ్యాన్​ పేరున సౌదీకి చెందిన 76 మంది వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో స్థిరపడ్డ పలువురు సౌదీ కార్యకర్తలు, జర్నలిస్టులపై వీరు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : సిరియాకు సాయాన్ని రాజకీయం చేయొద్దు: భారత్​

Last Updated : Feb 27, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.