ETV Bharat / international

రోజువారీ మరణాల్లో 9/11ను దాటేసిన కరోనా

author img

By

Published : Dec 11, 2020, 7:52 AM IST

అమెరికాలో కరోనా వైరస్​ పంజా విసురుతోంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 3000మందికిపైగా వైరస్​కు బలయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలోని నార్మాండీ దాడి(డీ-డే), 9/11 దాడుల్లో సంభవించిన మరణాల కన్నా బుధవారం నమోదైన కరోనా మృతుల సంఖ్యే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Covid deaths in America
అమెరికాలో కరోనా మరణాలు

కరోనా వ్యాక్సిన్​ విస్తృత వినియోగానికి అమెరికా సన్నద్ధమవుతున్న వేళ ఆ దేశంలో వైరస్​ పంజా అందోళకర స్థాయికి చేరింది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే.. ఏకంగా 3000లకుపైగా మరణాలు సంభవించాయి. 9/11 ఉగ్రదాడుల్లో మరణాలతో పోలిస్తే బుధవారం నమోదైన కరోనా మరణాలే అధికంగా ఉండటం గమనార్హం.

బుధవారం అమెరికాలో 3,124 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజు మరణాల సంఖ్యలో ఇదే అత్యధికం. ఏప్రిల్​ 15న నమోదైన 2,603 మరణాలే ఇప్పటి వరకు ఒక్కరోజు మరణాల్లో గరిష్ఠంగా ఉండగా.. తాజా గణాంకాలు ఆ రికార్డును చెరిపేశాయి.

ఆ దాడుల్లో కన్నా..

రెండవ ప్రపంచ యుద్ధంలో నార్మాండీ దండయాత్ర ప్రారంభ రోజున మొత్తం 4,400 మంది మరణించగా.. అందులో అమెరికన్లే అత్యధికంగా 2,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. 2001, సెప్టెంబర్​ 11న జరిగిన ఉగ్రదాడిలో 2,977 మంది మృతిచెందారు. ఈ రెండు దాడులతో పోల్చితే బుధవారం వెలుగుచూసిన మరణాలే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

5 రోజుల్లో 10 లక్షల మందికి..

దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో ఆసుపత్రులు.. ఆరోగ్య కేంద్రాలు వైరస్​ బాధితులతో నిండిపోయాయి. వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు సేవలందించాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో పడకల కోసం ఐసీయూల ముందు రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆరోగ్య సిబ్బంది పేర్కొంటున్నారు. అగ్రరాజ్యంలో గత ఐదు రోజుల్లో 10 లక్షల మందికి వైరస్​ సోకింది. అందులో 1,06,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,90,000 మంది మరణించారు. కోటిన్నర మందికిపైగా వైరస్​ సోకింది.

ఫైజర్​ టీకాకు ఆమోదం..!

ఫైజర్​-బయోఎన్​టెక్​ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి గురువారం ఆమోదం తెలిపింది అమెరికా నిపుణుల కమిటీ. యూఎస్​ ఎఫ్​డీఏ అనుమతులు రాగానే పెద్ద ఎత్తున పంపిణీకి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.

ఇదీ చూడండి: టీకా వేయించుకున్నా మాస్క్ తప్పనిసరి!

కరోనా వ్యాక్సిన్​ విస్తృత వినియోగానికి అమెరికా సన్నద్ధమవుతున్న వేళ ఆ దేశంలో వైరస్​ పంజా అందోళకర స్థాయికి చేరింది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే.. ఏకంగా 3000లకుపైగా మరణాలు సంభవించాయి. 9/11 ఉగ్రదాడుల్లో మరణాలతో పోలిస్తే బుధవారం నమోదైన కరోనా మరణాలే అధికంగా ఉండటం గమనార్హం.

బుధవారం అమెరికాలో 3,124 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజు మరణాల సంఖ్యలో ఇదే అత్యధికం. ఏప్రిల్​ 15న నమోదైన 2,603 మరణాలే ఇప్పటి వరకు ఒక్కరోజు మరణాల్లో గరిష్ఠంగా ఉండగా.. తాజా గణాంకాలు ఆ రికార్డును చెరిపేశాయి.

ఆ దాడుల్లో కన్నా..

రెండవ ప్రపంచ యుద్ధంలో నార్మాండీ దండయాత్ర ప్రారంభ రోజున మొత్తం 4,400 మంది మరణించగా.. అందులో అమెరికన్లే అత్యధికంగా 2,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. 2001, సెప్టెంబర్​ 11న జరిగిన ఉగ్రదాడిలో 2,977 మంది మృతిచెందారు. ఈ రెండు దాడులతో పోల్చితే బుధవారం వెలుగుచూసిన మరణాలే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

5 రోజుల్లో 10 లక్షల మందికి..

దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో ఆసుపత్రులు.. ఆరోగ్య కేంద్రాలు వైరస్​ బాధితులతో నిండిపోయాయి. వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు సేవలందించాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో పడకల కోసం ఐసీయూల ముందు రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆరోగ్య సిబ్బంది పేర్కొంటున్నారు. అగ్రరాజ్యంలో గత ఐదు రోజుల్లో 10 లక్షల మందికి వైరస్​ సోకింది. అందులో 1,06,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,90,000 మంది మరణించారు. కోటిన్నర మందికిపైగా వైరస్​ సోకింది.

ఫైజర్​ టీకాకు ఆమోదం..!

ఫైజర్​-బయోఎన్​టెక్​ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి గురువారం ఆమోదం తెలిపింది అమెరికా నిపుణుల కమిటీ. యూఎస్​ ఎఫ్​డీఏ అనుమతులు రాగానే పెద్ద ఎత్తున పంపిణీకి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.

ఇదీ చూడండి: టీకా వేయించుకున్నా మాస్క్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.