ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగంపై నిపుణులు ఏమన్నారంటే..? - Donald Trump

అమెరికా ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. రిపబ్లికన్​ అధ్యక్ష అభ్యర్థిగా తన పేరు అధికారికంగా ​నామినేట్​ చేశాక.. తొలిసారి ప్రసంగం చేశారు డొనాల్డ్​ ట్రంప్​. వైట్​హౌస్​ వద్ద జరిగిన రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అయితే వాటిని విశ్లేషించి నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ. నిపుణుల ప్యానెల్​ చెప్పిన విశేషాలను ఓసారి పరిశీలిద్దాం..

BattlegroundUSA2020
డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగంపై నిపుణులు ఏమంటున్నారంటే..?
author img

By

Published : Aug 28, 2020, 10:31 PM IST

అమెరికా అధ్యక్ష పదవి కోసం రెండోసారి పోటీపడుతున్నారు డొనాల్డ్​ ట్రంప్​. గురువారం ఆయన నామినేషన్​ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​లో ట్రంప్​ ప్రసంగించారు. ఈ వేదికపై ప్రత్యర్థి జో బైడెన్​ సహా తన 47 ఏళ్ల రాజకీయ రికార్డుల గురించి ప్రస్తావించారు. డెమొక్రాట్లను 'ఆల్ట్రా రాడికల్ లెఫ్ట్​'గా అభివర్ణించిన ట్రంప్​.. జాత్యహంకారం, నల్లజాతీయుల సమస్యల పేరిట డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న మిన్నియాపొలిస్ లేదా కేనోషాలో ఘర్షణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.

"అమెరికా చరిత్రలోనే ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. గతంలో ఎప్పుడూ రెండు పార్టీలు, రెండు విజన్​లు, రెండు ఫిలాసఫీలు, రెండు అజెండాల మధ్య స్పష్టమైన ఎంపిక ఓటర్లకు ఉండేది కాదు. అమెరికన్ కలను రక్షించుకోవాలా? లేదంటే సోషలిస్ట్ ఎజెండాకు అనుమతి ఇచ్చి నాశనం చేసుకోవాలా? అనేది మీరే నిర్ణయించుకోండి"

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

"అమెరికన్ల జీవన విధానాన్ని కాపాడే రిపబ్లికన్లకా ఓటు? లేదంటే ఒక రాడికల్ ఉద్యమానికి ఊతమిచ్చి దేశాన్ని నాశనం చేసే వాళ్లకు అనుమతిస్తారా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని'' ట్రంప్​ అన్నారు.

"డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడిన జో బైడెన్ అమెరికాలో జాతి, ఆర్థిక, సామాజిక అన్యాయం గురించే ప్రస్తావించారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాను. మన దేశాన్ని కూల్చివేసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న డెమొక్రాట్​ పార్టీ.. దేశాన్ని నడిపిస్తామని ఎలా అధికారం అడగగలదు?" అని ట్రంప్​ తన 71 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ప్రశ్నల వర్షం కురిపించారు.

విమర్శలే విమర్శలు...

బహిరంగ సభ రూపంలో రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​ జరగ్గా.. గతవారం వర్చువల్​గా డెమొక్రాట్​ కన్వెన్షన్​ నిర్వహించారు. ఎంతో పేరున్న, అధ్యక్షులకు నెలవైన వైట్​హౌస్​ను ట్రంప్​ రాజకీయ కార్యక్రమానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన సమస్యలు ఏంటి? ట్రంప్​ ప్రసంగంపై అభిప్రాయం.? వంటి అంశాలపై 'బ్యాటిల్​గ్రౌండ్​యూఎస్​ఏ2020' పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ. ఇందులో రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​ సహా ట్రంప్​ ప్రసంగంపై నిపుణులు అభిప్రాయమిదే.

డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగం

" దాదాపు 1500 మంది వైట్​హౌస్​ దగ్గర సమావేశమయ్యారు. వారిలో ఒక్కరూ మాస్కు ధరించలేదు. అది కచ్చితంగా గమనించాల్సిన అంశం. భౌతిక దూరం అనేదే లేదు. ప్రస్తుతం మహమ్మారి లేనట్లు కరోనా ఎప్పుడిదో అనేలా ఓ వక్త మాట్లాడారు. ఇదంగా వాస్తవికతకు దూరంగా, వేరే ప్రపంచంలా అనిపించింది. వైట్​హౌస్​ ముఖద్వారం వద్ద నిరసనకారులు లోపలికి రాకుండా పోలీసులు గేట్ల వద్ద రక్షణగా ఉన్నారు. అది చూశాక రెండు దేశాల మధ్య ఉన్నట్లు అనిపించింది. కొంత కాలంగా పరిస్థితులు అలానే ఉన్నా.. ఈరోజు అది స్పష్టంగా తెలిసింది"

-- సీమా సిరోహీ, సీనియర్​ జర్నలిస్ట్​ అండ్​ కాలమిస్ట్​, వాషింగ్టన్​ డీసీ

'ఓపెన్​ ఎంబ్రాస్​: ఇండో-యూఎస్​ టైస్​ ఇన్​ ద ఏజ్​ ఆఫ్​ మోదీ అండ్​ ట్రంప్' అనే పుస్తకం రాసిన వర్గీస్​ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"అమెరికా అంటే ఏమిటి? ట్రంప్ దృక్పథంలో అది ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ రోజు ఓ కథ విన్నాం. కొన్ని రోజుల క్రితం అమెరికా అంటే ఏమిటో బైడెన్​ ప్రచారంలోనూ ఓ కథ విన్నాం. ఒకే స్థాయిలో రెండు ప్రసంగాలు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ వారి కథలకు ఎవరికి మెజారిటీ మద్దతు లభిస్తుందనేది ఎన్నికే నిర్ణయిస్తుంది"

-- వర్గీస్​ కే జార్జ్​, హిందూ సంస్థలో అసోసియేట్​ ఎడిటర్

"ట్రంప్, బైడెన్​ కథల మధ్య పోటీ నడిచింది. అయితే డొనాల్డ్​ కథ కొన్ని విషయాలను బయటపెట్టింది. 'మేము వైరస్ గురించి పట్టించుకోము, మేము వైరస్​కు లొంగిపోని నాగరికత. కానీ తిరిగి పోరాడి వైరస్​ను జయిస్తాం' అనేది మాత్రం ప్రజలకు, ప్రపంచానికి తెలియజేశారు ట్రంప్​" అని వర్గీస్​ అభిప్రాయపడ్డారు.

ఆ క్రెడిట్​ అంతా ట్రంప్​ ఖాతాలోనే..?

''రిపబ్లికన్లు, భాజపాకు మధ్య రాజకీయ సైద్ధాంతిక ప్రచారాల్లో సమాంతరాలు కనిపిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కుల అడ్డంకులను అధిగమించేందుకు హిందూ-హిందుత్వ ఎజెండాను ప్రోత్సహించారు. అదే విధంగా బ్లాక్ లివ్స్ విషయంపై కఠినంగా ఉంటూ ట్రంప్ మెజార్టీ కాథలిక్ విశ్వాసాన్ని చూరగొంటున్నారని'' విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ట్రంప్​ తన ప్రచారంలో బైడెన్​పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజింగ్​పై సానుకూల నిర్ణయాలు.. బైడెన్​ ఎన్నికైతే అమెరికా.. చైనా అధీనంలోకి వెళ్లిపోతుందని ట్రంప్​ అన్నారు. జెరూసలేంలో యూఎస్​ ఎంబసీ ఏర్పాటు సహా ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య చారిత్రక ఒప్పందాన్ని తన కీలక నిర్ణయాల్లో ఒకటిగా ఆయన​ పేర్కొన్నారు.

"నేను అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమాసియా అంతా గొడవలతో ఉంది. ఐసిస్​ చెలరేగిపోతోంది. ఇరాన్​ పెచ్చరిల్లుతుంటే.. అఫ్గాన్​లో యుద్ధం ఆగేలా కనిపించలేదు. ఇరాన్​ అణు ఒప్పందం​ నుంచి ఏకపక్షంగా వైదొలిగాను. నా కంటే ముందు పనిచేసిన అధ్యక్షుల మాదిరిగా కాకుండా నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. ఇజ్రాయెల్ నిజమైన రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ.. రాయబార కార్యాలయాన్ని అక్కడకు తరలించాం."

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

"ఏడు దశాబ్దాల విభేదాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్​తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న తొలి దేశంగా గల్ఫ్​ నిలిచింది. గత 25 ఏళ్లలో పశ్చిమాసియా దేశాలతో జరిగిన శాంతి ఒప్పందం ఇదే. ఐసిస్​ నాయకుడు అబు బకర్​ అల్​-బాగ్దాదీని చంపడం, మరో ఆపరేషన్​లో ఖాసిం సులేమానీని చంపాం. అమెరికా కొత్త యుద్ధాలు చేపట్టకుండా మన దళాలను స్వస్థలాలకు తీసుకొచ్చాం" అని ట్రంప్​ పేర్కొన్నారు. అయితే దీనిపై మైథోస్​ ల్యాబ్స్​ సీఈఓ ప్రియాంక్​ తన అభిప్రాయం వెల్లడించారు.

" విదేశీ విధానం, అమెరికా ఎన్నికలకు సంబంధం లేదు. బిన్​ లాడెన్​లా సులేమానీ పేరు ప్రాముఖ్యమైనది కాదు. కానీ మళ్లీ అలనాటి మ్యాజిక్​ను క్రియేట్​ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సులేమానీ అనే పేరే అమెరికన్లకు తెలియదు. కానీ ఒబామా హయాంలో అమెరికన్​ సీల్స్​ లాడెన్​ను చంపాక.. ప్రజలు రోడ్లపై సంబరాలు చేసుకున్నారు."

-- ప్రియాంక్​ మాథుర్​, మైథోస్​ ల్యాబ్స్​ సీఈఓ

కరోనా నేపథ్యంలో పోస్టల్​ బ్యాలెట్​ వాడకం వల్ల ఎన్నికలు, ఫలితాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అన్న కోణంలోనూ విశ్లేషకులు మాట్లాడారు. పోస్టల్​ బ్యాలెట్​ సేకరణకు సమయం పడుతుంది కాబట్టి ఎన్నికల ఫలితాలు నవంబర్ 4న రాకపోచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారం పాటు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం కావొచ్చని అంచనా వేశారు.

అమెరికా అధ్యక్ష పదవి కోసం రెండోసారి పోటీపడుతున్నారు డొనాల్డ్​ ట్రంప్​. గురువారం ఆయన నామినేషన్​ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​లో ట్రంప్​ ప్రసంగించారు. ఈ వేదికపై ప్రత్యర్థి జో బైడెన్​ సహా తన 47 ఏళ్ల రాజకీయ రికార్డుల గురించి ప్రస్తావించారు. డెమొక్రాట్లను 'ఆల్ట్రా రాడికల్ లెఫ్ట్​'గా అభివర్ణించిన ట్రంప్​.. జాత్యహంకారం, నల్లజాతీయుల సమస్యల పేరిట డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న మిన్నియాపొలిస్ లేదా కేనోషాలో ఘర్షణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.

"అమెరికా చరిత్రలోనే ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. గతంలో ఎప్పుడూ రెండు పార్టీలు, రెండు విజన్​లు, రెండు ఫిలాసఫీలు, రెండు అజెండాల మధ్య స్పష్టమైన ఎంపిక ఓటర్లకు ఉండేది కాదు. అమెరికన్ కలను రక్షించుకోవాలా? లేదంటే సోషలిస్ట్ ఎజెండాకు అనుమతి ఇచ్చి నాశనం చేసుకోవాలా? అనేది మీరే నిర్ణయించుకోండి"

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

"అమెరికన్ల జీవన విధానాన్ని కాపాడే రిపబ్లికన్లకా ఓటు? లేదంటే ఒక రాడికల్ ఉద్యమానికి ఊతమిచ్చి దేశాన్ని నాశనం చేసే వాళ్లకు అనుమతిస్తారా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని'' ట్రంప్​ అన్నారు.

"డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడిన జో బైడెన్ అమెరికాలో జాతి, ఆర్థిక, సామాజిక అన్యాయం గురించే ప్రస్తావించారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాను. మన దేశాన్ని కూల్చివేసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న డెమొక్రాట్​ పార్టీ.. దేశాన్ని నడిపిస్తామని ఎలా అధికారం అడగగలదు?" అని ట్రంప్​ తన 71 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ప్రశ్నల వర్షం కురిపించారు.

విమర్శలే విమర్శలు...

బహిరంగ సభ రూపంలో రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​ జరగ్గా.. గతవారం వర్చువల్​గా డెమొక్రాట్​ కన్వెన్షన్​ నిర్వహించారు. ఎంతో పేరున్న, అధ్యక్షులకు నెలవైన వైట్​హౌస్​ను ట్రంప్​ రాజకీయ కార్యక్రమానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన సమస్యలు ఏంటి? ట్రంప్​ ప్రసంగంపై అభిప్రాయం.? వంటి అంశాలపై 'బ్యాటిల్​గ్రౌండ్​యూఎస్​ఏ2020' పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ. ఇందులో రిపబ్లికన్​ నేషనల్​ కన్వెన్షన్​ సహా ట్రంప్​ ప్రసంగంపై నిపుణులు అభిప్రాయమిదే.

డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగం

" దాదాపు 1500 మంది వైట్​హౌస్​ దగ్గర సమావేశమయ్యారు. వారిలో ఒక్కరూ మాస్కు ధరించలేదు. అది కచ్చితంగా గమనించాల్సిన అంశం. భౌతిక దూరం అనేదే లేదు. ప్రస్తుతం మహమ్మారి లేనట్లు కరోనా ఎప్పుడిదో అనేలా ఓ వక్త మాట్లాడారు. ఇదంగా వాస్తవికతకు దూరంగా, వేరే ప్రపంచంలా అనిపించింది. వైట్​హౌస్​ ముఖద్వారం వద్ద నిరసనకారులు లోపలికి రాకుండా పోలీసులు గేట్ల వద్ద రక్షణగా ఉన్నారు. అది చూశాక రెండు దేశాల మధ్య ఉన్నట్లు అనిపించింది. కొంత కాలంగా పరిస్థితులు అలానే ఉన్నా.. ఈరోజు అది స్పష్టంగా తెలిసింది"

-- సీమా సిరోహీ, సీనియర్​ జర్నలిస్ట్​ అండ్​ కాలమిస్ట్​, వాషింగ్టన్​ డీసీ

'ఓపెన్​ ఎంబ్రాస్​: ఇండో-యూఎస్​ టైస్​ ఇన్​ ద ఏజ్​ ఆఫ్​ మోదీ అండ్​ ట్రంప్' అనే పుస్తకం రాసిన వర్గీస్​ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"అమెరికా అంటే ఏమిటి? ట్రంప్ దృక్పథంలో అది ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ రోజు ఓ కథ విన్నాం. కొన్ని రోజుల క్రితం అమెరికా అంటే ఏమిటో బైడెన్​ ప్రచారంలోనూ ఓ కథ విన్నాం. ఒకే స్థాయిలో రెండు ప్రసంగాలు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ వారి కథలకు ఎవరికి మెజారిటీ మద్దతు లభిస్తుందనేది ఎన్నికే నిర్ణయిస్తుంది"

-- వర్గీస్​ కే జార్జ్​, హిందూ సంస్థలో అసోసియేట్​ ఎడిటర్

"ట్రంప్, బైడెన్​ కథల మధ్య పోటీ నడిచింది. అయితే డొనాల్డ్​ కథ కొన్ని విషయాలను బయటపెట్టింది. 'మేము వైరస్ గురించి పట్టించుకోము, మేము వైరస్​కు లొంగిపోని నాగరికత. కానీ తిరిగి పోరాడి వైరస్​ను జయిస్తాం' అనేది మాత్రం ప్రజలకు, ప్రపంచానికి తెలియజేశారు ట్రంప్​" అని వర్గీస్​ అభిప్రాయపడ్డారు.

ఆ క్రెడిట్​ అంతా ట్రంప్​ ఖాతాలోనే..?

''రిపబ్లికన్లు, భాజపాకు మధ్య రాజకీయ సైద్ధాంతిక ప్రచారాల్లో సమాంతరాలు కనిపిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కుల అడ్డంకులను అధిగమించేందుకు హిందూ-హిందుత్వ ఎజెండాను ప్రోత్సహించారు. అదే విధంగా బ్లాక్ లివ్స్ విషయంపై కఠినంగా ఉంటూ ట్రంప్ మెజార్టీ కాథలిక్ విశ్వాసాన్ని చూరగొంటున్నారని'' విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ట్రంప్​ తన ప్రచారంలో బైడెన్​పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజింగ్​పై సానుకూల నిర్ణయాలు.. బైడెన్​ ఎన్నికైతే అమెరికా.. చైనా అధీనంలోకి వెళ్లిపోతుందని ట్రంప్​ అన్నారు. జెరూసలేంలో యూఎస్​ ఎంబసీ ఏర్పాటు సహా ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య చారిత్రక ఒప్పందాన్ని తన కీలక నిర్ణయాల్లో ఒకటిగా ఆయన​ పేర్కొన్నారు.

"నేను అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమాసియా అంతా గొడవలతో ఉంది. ఐసిస్​ చెలరేగిపోతోంది. ఇరాన్​ పెచ్చరిల్లుతుంటే.. అఫ్గాన్​లో యుద్ధం ఆగేలా కనిపించలేదు. ఇరాన్​ అణు ఒప్పందం​ నుంచి ఏకపక్షంగా వైదొలిగాను. నా కంటే ముందు పనిచేసిన అధ్యక్షుల మాదిరిగా కాకుండా నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. ఇజ్రాయెల్ నిజమైన రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ.. రాయబార కార్యాలయాన్ని అక్కడకు తరలించాం."

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

"ఏడు దశాబ్దాల విభేదాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్​తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న తొలి దేశంగా గల్ఫ్​ నిలిచింది. గత 25 ఏళ్లలో పశ్చిమాసియా దేశాలతో జరిగిన శాంతి ఒప్పందం ఇదే. ఐసిస్​ నాయకుడు అబు బకర్​ అల్​-బాగ్దాదీని చంపడం, మరో ఆపరేషన్​లో ఖాసిం సులేమానీని చంపాం. అమెరికా కొత్త యుద్ధాలు చేపట్టకుండా మన దళాలను స్వస్థలాలకు తీసుకొచ్చాం" అని ట్రంప్​ పేర్కొన్నారు. అయితే దీనిపై మైథోస్​ ల్యాబ్స్​ సీఈఓ ప్రియాంక్​ తన అభిప్రాయం వెల్లడించారు.

" విదేశీ విధానం, అమెరికా ఎన్నికలకు సంబంధం లేదు. బిన్​ లాడెన్​లా సులేమానీ పేరు ప్రాముఖ్యమైనది కాదు. కానీ మళ్లీ అలనాటి మ్యాజిక్​ను క్రియేట్​ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సులేమానీ అనే పేరే అమెరికన్లకు తెలియదు. కానీ ఒబామా హయాంలో అమెరికన్​ సీల్స్​ లాడెన్​ను చంపాక.. ప్రజలు రోడ్లపై సంబరాలు చేసుకున్నారు."

-- ప్రియాంక్​ మాథుర్​, మైథోస్​ ల్యాబ్స్​ సీఈఓ

కరోనా నేపథ్యంలో పోస్టల్​ బ్యాలెట్​ వాడకం వల్ల ఎన్నికలు, ఫలితాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అన్న కోణంలోనూ విశ్లేషకులు మాట్లాడారు. పోస్టల్​ బ్యాలెట్​ సేకరణకు సమయం పడుతుంది కాబట్టి ఎన్నికల ఫలితాలు నవంబర్ 4న రాకపోచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారం పాటు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం కావొచ్చని అంచనా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.