ETV Bharat / international

అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

author img

By

Published : Jan 30, 2021, 11:59 AM IST

Updated : Jan 30, 2021, 12:49 PM IST

అమెరికా కాలిఫోర్నియాలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు అక్కడి భారతీయ అమెరికన్లు.

Mahatma Gandhi statue vandalised in US
అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. దావిస్​ సిటీలోని సెంట్రల్​ పార్కులో ఉన్న ఈ ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

భారత సర్కారు 2016లో.. 294 కేజీలతో తయారు చేసిన ఈ గాంధీజీ విగ్రహాన్ని దావిస్​ సిటీకి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు జనవరి 28న ధ్వంసం చేసినట్లు పార్కు యాజమాన్యం తెలిపింది. ఈ చర్యపై భారత సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Mahatma Gandhi statue vandalised in US
ధ్వంసమైన మహాత్ముడి విగ్రహం

ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కోరింది. ఈ నీచమైన చర్యకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చూడాలని సూచించింది. సాన్​ ఫ్రాన్సిస్కోలోని భారతీయ దౌత్యాధికారి కూడా మహాత్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. దావిస్​ సిటీ అధికారులను ప్రత్యేకంగా కలిసి దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన దావిస్ మేయర్.. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారని స్పష్టం చేశారు.

2016లో కొన్ని మైనారిటీ సంస్థలు, ఖలిస్థానీ సంస్థలు ఈ విగ్రహం ఏర్పాటుకు వ్యక్తిరేకంగా ర్యాలీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థలే విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్​దే పైచేయి!

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. దావిస్​ సిటీలోని సెంట్రల్​ పార్కులో ఉన్న ఈ ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

భారత సర్కారు 2016లో.. 294 కేజీలతో తయారు చేసిన ఈ గాంధీజీ విగ్రహాన్ని దావిస్​ సిటీకి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు జనవరి 28న ధ్వంసం చేసినట్లు పార్కు యాజమాన్యం తెలిపింది. ఈ చర్యపై భారత సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Mahatma Gandhi statue vandalised in US
ధ్వంసమైన మహాత్ముడి విగ్రహం

ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కోరింది. ఈ నీచమైన చర్యకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చూడాలని సూచించింది. సాన్​ ఫ్రాన్సిస్కోలోని భారతీయ దౌత్యాధికారి కూడా మహాత్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. దావిస్​ సిటీ అధికారులను ప్రత్యేకంగా కలిసి దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన దావిస్ మేయర్.. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారని స్పష్టం చేశారు.

2016లో కొన్ని మైనారిటీ సంస్థలు, ఖలిస్థానీ సంస్థలు ఈ విగ్రహం ఏర్పాటుకు వ్యక్తిరేకంగా ర్యాలీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థలే విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్​దే పైచేయి!

Last Updated : Jan 30, 2021, 12:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.