ETV Bharat / international

ఖాసీం మృతితో అమెరికా-ఇరాన్​ మధ్య యుద్ధమేఘాలు!

author img

By

Published : Jan 3, 2020, 12:52 PM IST

అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమనీ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ అగ్రనేతలు బహిరంగంగా ప్రకటించారు.

us-iran
us-iran

అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్​ అగ్రనేత ఖాసీం సులేమనీ మృతిచెందటం వల్ల పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో కీలక పరిణామంగా పరిగణిస్తున్న ఈ దాడిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది.

ఖాసీం మృతికి ఇరాన్​తో పాటు పశ్చిమ ప్రాంతంలోని స్వతంత్ర దేశాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు.

"ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గొప్ప దేశమైన ఇరాన్​తో పాటు పశ్చిమాసియాలోని స్వతంత్ర దేశాలు అమెరికా పాల్పడిన ఈ నేరానికి ప్రతీకారం తీర్చుకుంటాయి."

- హసన్ రౌహానీ, ఇరాన్ అధ్యక్షుడు

ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ స్పష్టం చేశారు.

"దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడు సులేమనీ. ఖాసీం దైవ సన్నిధికి చేరినా.. ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తాం. ఖాసీంతోపాటు మరికొందరు అమరుల రక్తంతో చేతులు తడుపుకొన్న నేరస్థులు... ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలి. "

- అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్​ సుప్రీం నేత

ఖాసీం మృతి పట్ల 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు ఖమేనీ. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరాన్‌ ఉన్నతస్థాయి భద్రతా సంస్థ అత్యవసరంగా సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చించింది.

ఇరాక్​ ప్రకటన

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ రాకెట్​ దాడిలో సులేమనీతోపాటు మిలిషియా గ్రూపు డిప్యూటీ కమాండర్​ అబు అల్​ ముహందీస్​, మరో ఆరుగురు మరణించారని ఇరాక్​ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

లెబనాన్​ లేదా సిరాయ నుంచి వచ్చిన ఖాసీంకు స్వాగతం పలికేందుకు మహందీస్​.. కాన్వాయ్​తో బాగ్దాద్​ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడులు జరిగినట్లు ఇరాక్​ వర్గాలు తెలిపాయి. ఖాసీం విమానం దిగిన వెంటనే రాకెట్ దాడులు జరిగినట్లు సమాచారం.

అమెరికా ధ్రువీకరణ

బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి ప్రతిగా ఈ దాడి చేసినట్లు పెంటగాన్​ ప్రకటించింది. అమెరికా ఎంబసీపై దాడి జరిగిన మరుసటి రోజే అమెరికా ప్రతిచర్య చేపట్టింది.

ఇదీ జరిగింది..

ఇరాన్‌తో సంబంధం వున్న ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దళం ఆదివారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో 25 మంది మిలిటెంట్లు మరణించగా, మరో 55 మందికి పైగా గాయపడ్డారు.

మృతుల్లో కతైబ్‌ హిజ్బుల్లాకు చెందిన నలుగురు కమాండర్లు ఉన్నారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై వేలాది మంది ప్రతిదాడికి దిగారు. కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించిన నిరసనకారులు.. ఫర్నీచర్‌తో పాటు టైర్లు కాల్చి విధ్వంసానికి దిగారు.

అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఇరాన్‌ అనుకూల ఉగ్రవాద సంస్థ కతైబ్‌ హిజ్బుల్లా సభ్యులు వైదొలిగిన వెంటనే అమెరికా ఈ దాడులకు దిగింది. కతైబ్​ సంస్థ మరికొన్ని దాడులు చేసే ప్రమాదం ఉందనే అనుమానంతోనే అమెరికా ఈ చర్యకు పాల్పడినట్లు పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్​.. పాంపియో ట్వీట్లు

విమానాశ్రయంపై దాడులకు సంబంధించి వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. ఆ దేశ జాతీయ జెండాను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఖాసీం మృతితో ఇరాక్​ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఈ మేరకు ఇరాక్​ జెండాతో వీధుల్లో పరుగెడుతున్న పౌరుల దృశ్యాలను ట్విట్టర్​లో పంచుకున్నారు పాంపియో.

యుద్ధ వాతావరణం!

కొంతకాలం నుంచి ఉద్రిక్తతలు నెమ్మదించినా రెండు దేశాల మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. తాజా దాడులతో అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్​ తదితర దేశాలపై ఇరాన్​ మద్దతుదారులు దాడులు తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ సర్కార్‌ అర్థాంతరంగా వైదొలిగినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత కొన్ని నెలలపాటు ఇవే పరిస్థితులు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పరం డ్రోన్లను కూల్చేసుకున్నాయి. కొద్ది రోజుల పాటు పశ్చిమాసియా సముద్రమార్గాల్లో చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి.

అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్​ అగ్రనేత ఖాసీం సులేమనీ మృతిచెందటం వల్ల పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో కీలక పరిణామంగా పరిగణిస్తున్న ఈ దాడిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది.

ఖాసీం మృతికి ఇరాన్​తో పాటు పశ్చిమ ప్రాంతంలోని స్వతంత్ర దేశాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు.

"ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గొప్ప దేశమైన ఇరాన్​తో పాటు పశ్చిమాసియాలోని స్వతంత్ర దేశాలు అమెరికా పాల్పడిన ఈ నేరానికి ప్రతీకారం తీర్చుకుంటాయి."

- హసన్ రౌహానీ, ఇరాన్ అధ్యక్షుడు

ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ స్పష్టం చేశారు.

"దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడు సులేమనీ. ఖాసీం దైవ సన్నిధికి చేరినా.. ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తాం. ఖాసీంతోపాటు మరికొందరు అమరుల రక్తంతో చేతులు తడుపుకొన్న నేరస్థులు... ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలి. "

- అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్​ సుప్రీం నేత

ఖాసీం మృతి పట్ల 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు ఖమేనీ. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరాన్‌ ఉన్నతస్థాయి భద్రతా సంస్థ అత్యవసరంగా సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చించింది.

ఇరాక్​ ప్రకటన

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ రాకెట్​ దాడిలో సులేమనీతోపాటు మిలిషియా గ్రూపు డిప్యూటీ కమాండర్​ అబు అల్​ ముహందీస్​, మరో ఆరుగురు మరణించారని ఇరాక్​ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

లెబనాన్​ లేదా సిరాయ నుంచి వచ్చిన ఖాసీంకు స్వాగతం పలికేందుకు మహందీస్​.. కాన్వాయ్​తో బాగ్దాద్​ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడులు జరిగినట్లు ఇరాక్​ వర్గాలు తెలిపాయి. ఖాసీం విమానం దిగిన వెంటనే రాకెట్ దాడులు జరిగినట్లు సమాచారం.

అమెరికా ధ్రువీకరణ

బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి ప్రతిగా ఈ దాడి చేసినట్లు పెంటగాన్​ ప్రకటించింది. అమెరికా ఎంబసీపై దాడి జరిగిన మరుసటి రోజే అమెరికా ప్రతిచర్య చేపట్టింది.

ఇదీ జరిగింది..

ఇరాన్‌తో సంబంధం వున్న ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దళం ఆదివారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో 25 మంది మిలిటెంట్లు మరణించగా, మరో 55 మందికి పైగా గాయపడ్డారు.

మృతుల్లో కతైబ్‌ హిజ్బుల్లాకు చెందిన నలుగురు కమాండర్లు ఉన్నారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై వేలాది మంది ప్రతిదాడికి దిగారు. కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించిన నిరసనకారులు.. ఫర్నీచర్‌తో పాటు టైర్లు కాల్చి విధ్వంసానికి దిగారు.

అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఇరాన్‌ అనుకూల ఉగ్రవాద సంస్థ కతైబ్‌ హిజ్బుల్లా సభ్యులు వైదొలిగిన వెంటనే అమెరికా ఈ దాడులకు దిగింది. కతైబ్​ సంస్థ మరికొన్ని దాడులు చేసే ప్రమాదం ఉందనే అనుమానంతోనే అమెరికా ఈ చర్యకు పాల్పడినట్లు పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్​.. పాంపియో ట్వీట్లు

విమానాశ్రయంపై దాడులకు సంబంధించి వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. ఆ దేశ జాతీయ జెండాను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఖాసీం మృతితో ఇరాక్​ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఈ మేరకు ఇరాక్​ జెండాతో వీధుల్లో పరుగెడుతున్న పౌరుల దృశ్యాలను ట్విట్టర్​లో పంచుకున్నారు పాంపియో.

యుద్ధ వాతావరణం!

కొంతకాలం నుంచి ఉద్రిక్తతలు నెమ్మదించినా రెండు దేశాల మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. తాజా దాడులతో అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్​ తదితర దేశాలపై ఇరాన్​ మద్దతుదారులు దాడులు తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ సర్కార్‌ అర్థాంతరంగా వైదొలిగినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత కొన్ని నెలలపాటు ఇవే పరిస్థితులు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పరం డ్రోన్లను కూల్చేసుకున్నాయి. కొద్ది రోజుల పాటు పశ్చిమాసియా సముద్రమార్గాల్లో చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
IRINN - NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 3 January 2020
1. IRINN newsreader reporting (Farsi): "Following the martyrdom of Islam's honourable general Qassem Soleimani and other martyrs accompanying him, especially Islam's great militant, Abu Mahdi al-Muhandis, the Supreme Leader has released a message."
2. Split-screen showing Supreme Leader Ayatollah Ali Khamenei and various video images of Soleimani as newsreader continues reading Khamenei's message (Farsi): "He (Soleimani) spent his entire life carrying out Jihad in God's path. Martyrdom was a reward for his ceaseless struggles during all those years. With God's grace, after his departure, his work and path won't stop or be blocked. But a harsh retaliation is waiting for the criminals whose filthy hands spilled his blood and the blood of other martyrs in last night's incident. Martyr Soleimani is the international face of resistance and all those who love resistance seek revenge over his blood."
STORYLINE:
Iran's Supreme Leader Ayatollah Ali Khamenei on Friday warned the US that a “harsh retaliation is waiting” for the killing of General Qassem Soleimani, the head of the country's elite Quds Force.
A statement by Khamenei carried by Iranian state TV called Soleimani “the international face of resistance”.
The US on Thursday confirmed that its military killed Soleimani at the direction of President Donald Trump.
The general, architect of Iran's regional security apparatus, was killed in an airstrike at Baghdad’s international airport on Friday local time, alongside the deputy commander of Iran-backed militias in Iraq.
Khamenei declared three days of public mourning for the general’s death.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.