ETV Bharat / international

భారత్​-పాకిస్థాన్​ మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్​ అధికం - breast cancer in india

రొమ్ము క్యాన్సర్​ వ్యాధి సోకే మహిళ్లల్లో భారత్​-పాకిస్థాన్​కు చెందినవారే అధికంగా ఉంటున్నట్టు ఓ సర్వేలో తేలింది. చిన్న వయస్సు వారు కూడా ఈ మహమ్మారి బారినపడుతున్నట్లు తెలిపింది. వ్యాధికి సంబంధించిన వివరాలు, లక్షణాల గురించి తెలియకపోవడం ఇందుకు కారణంగా పేర్కొంది.

Indian, Pakistani women diagnosed with more aggressive breast cancer at younger age: Study
భారత్​-పాకిస్థాన్​ మహిళల్లో వేగంగా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్​
author img

By

Published : Oct 27, 2020, 9:33 AM IST

రొమ్ము క్యాన్సర్​ బారిన పడే వారిలో.. భారత్​-పాకిస్థాన్​కు చెందిన మహిళలు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ సర్వేలైన్స్ పరిశోధకులు వెల్లిడించారు. ఎపిడెమియాలజీ అండ్​ ఎండ్ రిజల్ట్​ ప్రోగ్రాంలో భాగంగా భారత్- పాకిస్థాన్​, ఆంగ్లో-అమెరికన్లపై ఈ సర్వే ప్రధానంగా సాగింది.

సర్వేలో వెలుగు చూసిన పలు అంశాలను ఇంటర్నేషనల్‌ జర్నల్​ ఆఫ్ క్యాన్సర్​లో ప్రచురించారు పరిశోధకులు. 1990 నుంచి 2014 వరకు ఉన్న డేటా ఆధారంగా పరిశోధన జరిగినట్లు సెంటర్​ ఫర్​ సౌత్​ ఏసియన్​ క్వాంటిటేటివ్​ హెల్త్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ జయా సతగోపన్​ తెలిపారు. ఇందులో 4,900 మంది భారతీయ- పాకిస్థానీ మహిళలు, ఆంగ్లో అమెరికన్​లు సుమారు ఐదు లక్షల వరకు పాల్గొన్నారు.

సర్వేలోని ముఖ్యాంశాలు

  • రొమ్ము క్యాన్సర్​ బారిన పడే వారిలో దక్షిణాసియా ప్రజలే అధికం.
  • దక్షిణాసియాలో ఈ వ్యాధి గురించి, లక్షణాల గురించి తెలిసినవారు చాలా తక్కువ.
  • భారత్​-పాకిస్థాన్​ మహిళలు చిన్న వయస్సులోనే బ్రేస్ట్​ క్యాన్సర్​ బారినపడుతున్నారు.
  • ఆంగ్లో ఆమెరికన్లతో పోల్చితే దక్షిణాసియా వారిలో రొమ్ము క్యాన్సర్​తో ఇబ్బంది పడేవారు తక్కువ ఉన్నప్పటికీ.. గత కొద్ది సంవత్సరాలుగా వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది.
  • ఆంగ్లో అమెరికన్లతో పోల్చితే.. ఈ వ్యాధి కారణంగా భారత్​-పాక్​ దేశాల్లో మరణించేవారి సంఖ్య తక్కువ.
  • రొమ్ము క్యాన్సర్​ను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే భారత్​-అమెరికా మహిళల సంఖ్య తక్కువ.
  • భారత్-పాకిస్థాన్​లో రొమ్ము క్యాన్సర్​ను గుర్తించే పరీక్షలు కూడా తక్కవగా జరుగుతున్నాయి. కుటుంబ మద్దతు, రవాణా వ్యవస్థ, భయం, దేవునికి సంబంధించిన నమ్మకాలు, బయట వ్యక్తులకు తెలుస్తుందనే సిగ్గు.. వంటివి ఇందుకు కారణాలు.

అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం.. భారత్​, పాకిస్థాన్​ దేశాల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్​ పరీక్షలకు సామాజిక పరిస్థితులు అవరోధంగాా నిలుస్తున్నట్లు స్పష్టమైందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ తాజా పరిశోధనలతో.. రొమ్ము క్యాన్సర్​కు దారితీస్తున్న కారణాలను అర్థం చేసుకోవడం సహా భవిష్యత్​లో మెరుగైన పరిశోధనలు జరిపేందుకు వీలు కలిగిందని జయా సతగోపన్​ తెలిపారు.

ఇదీ చూడండి: రొమ్ముక్యాన్సర్​పై అపోహలు వీడితేనే.. విజయం!

రొమ్ము క్యాన్సర్​ బారిన పడే వారిలో.. భారత్​-పాకిస్థాన్​కు చెందిన మహిళలు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ సర్వేలైన్స్ పరిశోధకులు వెల్లిడించారు. ఎపిడెమియాలజీ అండ్​ ఎండ్ రిజల్ట్​ ప్రోగ్రాంలో భాగంగా భారత్- పాకిస్థాన్​, ఆంగ్లో-అమెరికన్లపై ఈ సర్వే ప్రధానంగా సాగింది.

సర్వేలో వెలుగు చూసిన పలు అంశాలను ఇంటర్నేషనల్‌ జర్నల్​ ఆఫ్ క్యాన్సర్​లో ప్రచురించారు పరిశోధకులు. 1990 నుంచి 2014 వరకు ఉన్న డేటా ఆధారంగా పరిశోధన జరిగినట్లు సెంటర్​ ఫర్​ సౌత్​ ఏసియన్​ క్వాంటిటేటివ్​ హెల్త్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ జయా సతగోపన్​ తెలిపారు. ఇందులో 4,900 మంది భారతీయ- పాకిస్థానీ మహిళలు, ఆంగ్లో అమెరికన్​లు సుమారు ఐదు లక్షల వరకు పాల్గొన్నారు.

సర్వేలోని ముఖ్యాంశాలు

  • రొమ్ము క్యాన్సర్​ బారిన పడే వారిలో దక్షిణాసియా ప్రజలే అధికం.
  • దక్షిణాసియాలో ఈ వ్యాధి గురించి, లక్షణాల గురించి తెలిసినవారు చాలా తక్కువ.
  • భారత్​-పాకిస్థాన్​ మహిళలు చిన్న వయస్సులోనే బ్రేస్ట్​ క్యాన్సర్​ బారినపడుతున్నారు.
  • ఆంగ్లో ఆమెరికన్లతో పోల్చితే దక్షిణాసియా వారిలో రొమ్ము క్యాన్సర్​తో ఇబ్బంది పడేవారు తక్కువ ఉన్నప్పటికీ.. గత కొద్ది సంవత్సరాలుగా వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది.
  • ఆంగ్లో అమెరికన్లతో పోల్చితే.. ఈ వ్యాధి కారణంగా భారత్​-పాక్​ దేశాల్లో మరణించేవారి సంఖ్య తక్కువ.
  • రొమ్ము క్యాన్సర్​ను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే భారత్​-అమెరికా మహిళల సంఖ్య తక్కువ.
  • భారత్-పాకిస్థాన్​లో రొమ్ము క్యాన్సర్​ను గుర్తించే పరీక్షలు కూడా తక్కవగా జరుగుతున్నాయి. కుటుంబ మద్దతు, రవాణా వ్యవస్థ, భయం, దేవునికి సంబంధించిన నమ్మకాలు, బయట వ్యక్తులకు తెలుస్తుందనే సిగ్గు.. వంటివి ఇందుకు కారణాలు.

అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం.. భారత్​, పాకిస్థాన్​ దేశాల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్​ పరీక్షలకు సామాజిక పరిస్థితులు అవరోధంగాా నిలుస్తున్నట్లు స్పష్టమైందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ తాజా పరిశోధనలతో.. రొమ్ము క్యాన్సర్​కు దారితీస్తున్న కారణాలను అర్థం చేసుకోవడం సహా భవిష్యత్​లో మెరుగైన పరిశోధనలు జరిపేందుకు వీలు కలిగిందని జయా సతగోపన్​ తెలిపారు.

ఇదీ చూడండి: రొమ్ముక్యాన్సర్​పై అపోహలు వీడితేనే.. విజయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.