ETV Bharat / international

'అగ్రరాజ్యంలో భారతీయ- అమెరికన్ల హవా'

author img

By

Published : Mar 5, 2021, 1:04 PM IST

భారతీయ-అమెరికన్లు అమెరికా ప్రగతి యాత్రలో కీలకంగా మారారని అన్నారు అధ్యక్షుడు జో బైడెన్​ తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్ సహా మరికొందరు భారతీయ-అమెరికన్లను కొనియాడారు.

Indian-Americans taking over US, says Biden as they keep getting key positions
'మరిన్ని కీలక స్థానాల్లో భారతీయ అమెరికన్లు'

అమెరికా ప్రగతి గాథలో భారతీయ-అమెరికన్లు కీలకంగా మారారని అన్నారు అధ్యక్షుడు జో బైడెన్​. తన ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో అనేక మంది భారతీయ అమెరికన్లు ఉండడాన్ని ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యానించారు.

నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ‘పర్సెవరెన్స్‌' రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందంతో బైడెన్​ వర్చువల్​గా మాట్లాడారు. ఈ ప్రయోగ నావిగేషన్, నియంత్రణ కార్యకలాపాలకు భారత సంతతి శాస్త్రవేత్త స్వాతి మోహన్ నాయకత్వం వహించారు. ఆమెతోపాటు ఇతర భారతీయ అమెరికన్లపై ప్రశంసల జల్లు కురిపించారు బైడెన్.

''భారత-సంతతి అమెరికన్లు దేశంలో కీలకంగా మారుతున్నారు. స్వాతి మోహన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నా స్పీచ్​ రైటర్ వినయ్ రెడ్డి వంటి వారే ఇందుకు నిదర్శనం.''

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

బైడెన్​ రికార్డు..

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బైడెన్.. ఇప్పటివరకు కనీసం 55 మంది భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించి చరిత్ర సృష్టించారు. వీరిలో దాదాపు సగం మంది మహిళలే కావడం విశేషం.

ఇదీ చదవండి: 'మన బంధానికి గాంధీ- కింగ్​ల వారసత్వమే నిదర్శనం'

అమెరికా ప్రగతి గాథలో భారతీయ-అమెరికన్లు కీలకంగా మారారని అన్నారు అధ్యక్షుడు జో బైడెన్​. తన ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో అనేక మంది భారతీయ అమెరికన్లు ఉండడాన్ని ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యానించారు.

నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ‘పర్సెవరెన్స్‌' రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందంతో బైడెన్​ వర్చువల్​గా మాట్లాడారు. ఈ ప్రయోగ నావిగేషన్, నియంత్రణ కార్యకలాపాలకు భారత సంతతి శాస్త్రవేత్త స్వాతి మోహన్ నాయకత్వం వహించారు. ఆమెతోపాటు ఇతర భారతీయ అమెరికన్లపై ప్రశంసల జల్లు కురిపించారు బైడెన్.

''భారత-సంతతి అమెరికన్లు దేశంలో కీలకంగా మారుతున్నారు. స్వాతి మోహన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నా స్పీచ్​ రైటర్ వినయ్ రెడ్డి వంటి వారే ఇందుకు నిదర్శనం.''

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

బైడెన్​ రికార్డు..

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బైడెన్.. ఇప్పటివరకు కనీసం 55 మంది భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించి చరిత్ర సృష్టించారు. వీరిలో దాదాపు సగం మంది మహిళలే కావడం విశేషం.

ఇదీ చదవండి: 'మన బంధానికి గాంధీ- కింగ్​ల వారసత్వమే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.