ETV Bharat / international

జాతి వివక్షపై పోరాటానికి గూగుల్​ సహాయం

author img

By

Published : Jun 4, 2020, 5:43 PM IST

ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతి నేపథ్యంలో జాతి వివక్షపై పోరాటం చేస్తున్న వారికి బాసటగా నిలిచింది గూగుల్​. 37 మిలియన్​​ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమరులైన నల్ల జాతీయుల కోసం ఎనిమిది నిముషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించాలని ఉద్యోగులకు సూచించింది.

google-pledges-usd-37-million-to-fight-racism
జాతి వివక్ష పోరాటానికి గూగుల్​ సాయం

జాతి వివక్షపై పోరాటానికి ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ బాసటగా నిలిచింది. 37 మిలియన్ అమెరికన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. జాతి అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్న సంస్థలకు 12 మిలియన్ డాలర్లు, జాత్యాంహకారంతో అన్యాయానికి గురతున్న వారి తరుఫున పోరాడుతున్న సంస్థలకు 25 మిలియన్ డాలర్లను అందజేయనున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో అమరులైన నల్లజాతీయులను స్మరిస్తూ ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మౌనం పాటించాలని ఉద్యోగులందరికీ బుధవారం మెయిల్ పంపింది గూగుల్​. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ హత్యను నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు చెలరేగుతున్న వేళ గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

జాతి వివక్షపై పోరాటానికి ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ బాసటగా నిలిచింది. 37 మిలియన్ అమెరికన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. జాతి అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్న సంస్థలకు 12 మిలియన్ డాలర్లు, జాత్యాంహకారంతో అన్యాయానికి గురతున్న వారి తరుఫున పోరాడుతున్న సంస్థలకు 25 మిలియన్ డాలర్లను అందజేయనున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో అమరులైన నల్లజాతీయులను స్మరిస్తూ ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మౌనం పాటించాలని ఉద్యోగులందరికీ బుధవారం మెయిల్ పంపింది గూగుల్​. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ హత్యను నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు చెలరేగుతున్న వేళ గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:గుజరాత్​లో కాంగ్రెస్​కు షాక్​... ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.