ETV Bharat / international

తీవ్ర పేదరికంలోకి 20 కోట్ల మంది: ఐరాస - ఐక్యరాజ్య సమితి

కొవిడ్​-19 వైరస్​ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 20 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకోనున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. దీంతో మొత్తం పేదవారి సంఖ్య వంద కోట్లు దాటుతుందని యూఎన్​డీపీ అధ్యయనం వెల్లడించింది.

Poverty
తీవ్ర పేదరికం
author img

By

Published : Dec 6, 2020, 10:54 AM IST

కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావం కారణంగా.. 2030 నాటికి 20 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర పేదరికం బారినపడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రపంచంలో మొత్తం పేదవారి సంఖ్య వంద కోట్లు దాటుతుందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యూఎన్​డీపీ కొత్త అధ్యయనం వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వివిధ రంగాల్లో కరోనా ప్రభావాన్ని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది.

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా రానున్న పదేళ్లల్లో 80 శాతం ఉత్పాదకత పడిపోతుందని అంచనా వేసింది యూఎన్​డీపీ. ఇది వృద్ధిని పూర్తిస్థాయిలో కోలుకోకుండా చేస్తుందని అధ్యయనం తెలిపింది.

వచ్చే దశాబ్దంలో స్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్​డీజీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర పేదరికాన్ని నిరోధించవచ్చని యూఎన్​డీపీ అభిప్రాయపడింది. ఎస్​డీజీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల 10.46 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడతారని, స్త్రీ పేదరికం 7.40 కోట్లకు తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.

ఇదీ చూడండి: పేదరిక నిర్మూలనపై బహుముఖ పోరు!

కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావం కారణంగా.. 2030 నాటికి 20 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర పేదరికం బారినపడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రపంచంలో మొత్తం పేదవారి సంఖ్య వంద కోట్లు దాటుతుందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యూఎన్​డీపీ కొత్త అధ్యయనం వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వివిధ రంగాల్లో కరోనా ప్రభావాన్ని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది.

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా రానున్న పదేళ్లల్లో 80 శాతం ఉత్పాదకత పడిపోతుందని అంచనా వేసింది యూఎన్​డీపీ. ఇది వృద్ధిని పూర్తిస్థాయిలో కోలుకోకుండా చేస్తుందని అధ్యయనం తెలిపింది.

వచ్చే దశాబ్దంలో స్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్​డీజీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర పేదరికాన్ని నిరోధించవచ్చని యూఎన్​డీపీ అభిప్రాయపడింది. ఎస్​డీజీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల 10.46 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడతారని, స్త్రీ పేదరికం 7.40 కోట్లకు తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.

ఇదీ చూడండి: పేదరిక నిర్మూలనపై బహుముఖ పోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.