అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ఉన్నత పదవుల్లో ఒకటైన ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ నీరా టాండెన్ను ఎంపిక చేయాలని బైడెన్ భావిస్తున్నారు.
అమెరికా సెనేట్ నుంచి ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడితే.. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా నీరా టాండెన్ చరిత్ర సృష్టిస్తారు. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ లెఫ్ట్-లీనింగ్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యుటివ్గా ఉన్నారు.
ట్రెజరీ సెక్రెటరీ నామినీ జనెట్ ఎల్తో కలిపి పని చేయడం సహా.. ప్రణాళికాబద్దమైన ఆర్థిక సలహాదారుల బృందాన్ని ఎర్పాటు చేసుకునే వ్యూహంలో భాగంగా బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
నీరా టాండెన్ సహా జనెట్ ఎలెన్ల నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇదీ చూడండి:బైడెన్ ప్రెస్ బృందంలో అందరూ మహిళలే