ETV Bharat / international

చైనా ఆధిపత్యానికి దీటుగా 'మలబార్'​ విన్యాసాలు

author img

By

Published : Oct 19, 2020, 8:28 PM IST

అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో జరిగే నౌకాదళ విన్యాసాల్లో భారత్​, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా పాల్గొననున్నాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. నాలుగు దేశాల కూటమితో నిర్వహించే ఈ విన్యాసాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

Australia to join 'Malabar', Quad takes up China's dare over Taiwan
చైనాకు గొడ్డలిపెట్టుగా.. నాలుగు దేశాలతో మలబార్​ సైనిక విన్యాసాలు

అరేబియా సముద్రం సహా.. బంగాళాఖాతంలో నవంబర్​లో నౌకాదళ సంయుక్త విన్యాసాలు జరగనున్నాయి. చతుర్భుజ కూటమిలో భాగస్వామ్య దేశాలైన అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ఇందులో పాల్గొంటాయని భారత్ ప్రకటించింది.

మలబార్ 2020 పేరిట జరిగే ఈ మెగా విన్యాసాల్లో తొలుత భారత్‌- అమెరికా- జపాన్​లు మాత్రమే భాగస్వాములయ్యాయి. అయితే.. చతుర్భుజ కూటమిలో భాగస్వామి అయిన ఆస్ట్రేలియానూ కలుపుకోవాలని ఆ దేశం విజ్ఞప్తి చేయడం వల్ల.. దానికి అంగీకరించింది భారత్.

చైనాను తక్కువ చేసేందుకే..

చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద వివాదం కొనసాగుతున్న తరుణంలో జరగనున్న ఈ సైనిక విన్యాసాలు.. ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సముద్ర రక్షణ విభాగంలో మరింతగా భాగస్వామ్యం పెంచుకునే దిశగా చతుర్భుజ కూటమి దేశాల మధ్య ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా హవాను తక్కువచేసే ఉద్దేశంతోనే ఈ విన్యాసాలు జరుపుతున్నట్లు చైనా ఆక్షేపిస్తోంది.

1992 నుంచి మలబార్ విన్యాసాలు నిర్వహిస్తుండగా.. తొలుత భారత్- అమెరికాలే ద్వైపాక్షికంగా జరుపుకొన్నాయి. 2015 నుంచి జపాన్‌ కూడా భాగస్వామిగా చేరినందున త్రైపాక్షికంగా మారాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా భాగస్వామి అయ్యింది.

ఇదీ చదవండి: కాఫీ రేణువులతో పెయింటింగ్​- గిన్నిస్​ రికార్డ్​

అరేబియా సముద్రం సహా.. బంగాళాఖాతంలో నవంబర్​లో నౌకాదళ సంయుక్త విన్యాసాలు జరగనున్నాయి. చతుర్భుజ కూటమిలో భాగస్వామ్య దేశాలైన అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ఇందులో పాల్గొంటాయని భారత్ ప్రకటించింది.

మలబార్ 2020 పేరిట జరిగే ఈ మెగా విన్యాసాల్లో తొలుత భారత్‌- అమెరికా- జపాన్​లు మాత్రమే భాగస్వాములయ్యాయి. అయితే.. చతుర్భుజ కూటమిలో భాగస్వామి అయిన ఆస్ట్రేలియానూ కలుపుకోవాలని ఆ దేశం విజ్ఞప్తి చేయడం వల్ల.. దానికి అంగీకరించింది భారత్.

చైనాను తక్కువ చేసేందుకే..

చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద వివాదం కొనసాగుతున్న తరుణంలో జరగనున్న ఈ సైనిక విన్యాసాలు.. ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సముద్ర రక్షణ విభాగంలో మరింతగా భాగస్వామ్యం పెంచుకునే దిశగా చతుర్భుజ కూటమి దేశాల మధ్య ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా హవాను తక్కువచేసే ఉద్దేశంతోనే ఈ విన్యాసాలు జరుపుతున్నట్లు చైనా ఆక్షేపిస్తోంది.

1992 నుంచి మలబార్ విన్యాసాలు నిర్వహిస్తుండగా.. తొలుత భారత్- అమెరికాలే ద్వైపాక్షికంగా జరుపుకొన్నాయి. 2015 నుంచి జపాన్‌ కూడా భాగస్వామిగా చేరినందున త్రైపాక్షికంగా మారాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా భాగస్వామి అయ్యింది.

ఇదీ చదవండి: కాఫీ రేణువులతో పెయింటింగ్​- గిన్నిస్​ రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.