వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో దాదాపు 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు అంతర్జాతీయంగా విశేష మద్దతు లభిస్తోంది. తాజాగా ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ కూడా సంఘీభావం తెలిపారు. రైతు ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు.
-
We stand in solidarity with the #FarmersProtest in India.
— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
https://t.co/tqvR0oHgo0
">We stand in solidarity with the #FarmersProtest in India.
— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021
https://t.co/tqvR0oHgo0We stand in solidarity with the #FarmersProtest in India.
— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021
https://t.co/tqvR0oHgo0
"భారత్లో జరుగుతున్న రైతుల నిరసనకు మేం సంఘీభావం తెలుపుతున్నాం."
-గ్రెటా థన్బర్గ్, పర్యావరణ ఉద్యమకారిణి
అంతకుముందు ప్రముఖ గాయని రిహానా సైతం రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేసిన కథనాన్ని షేర్ చేశారు. ఈ విషయంపై మనం ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
-
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
రిహానా ట్వీట్కు స్పందించిన యూకే పార్లమెంట్ సభ్యురాలు క్లాడియా వెబ్బే.. రాజకీయ నాయకత్వలేమి నెలకొన్న ప్రస్తుత సమయంలో ఇతరులు ముందుకు రావడం గొప్పవిషయమని కొనియాడారు.
మీనా హారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బంధువు మీనా హారిస్ సైతం రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. అంతర్జాలాన్ని నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై పారామిలిటరీ సిబ్బంది దాడిని ఖండించారు. 'ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యంపై దాడి జరిగి నెలరోజులు తిరగకముందే.. అతిపెద్ద ప్రజాస్వామ్యం దాడికి గురైంద'ని వ్యాఖ్యానించారు. 'నియంతృత్వ నిరంకుశవాదులు' ఇంకా ఉన్నారని గుర్తిస్తేనే ఇలాంటి వాటిని ఆపగలరని పేర్కొన్నారు.
మరోవైపు, భారత్లో జరుగుతున్న నిరసనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు, రిపబ్లికన్ నేత జిమ్ కోస్టా తెలిపారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కును గౌరవించాలని హితవు పలికారు.