అమెరికాలో అధ్యక్షుడి విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్', ఉపాధ్యక్షురాలు, ఇతర ప్రముఖులు ఉపయోగించే లోహవిహంగాలను నిలిపే 'జాయింట్ బేస్ ఆండ్రూస్' వైమానిక స్థావరంలోకి ఓ చొరబాటుదారుడు ప్రవేశించడం కలకలం సృష్టించింది. అంతేకాదు.. ఉపాధ్యక్షురాలు ఉపయోగించే 'సి-40బి' విమానంలోకి కూడా అతడు ప్రవేశించాడు.
ఆయుధాలు లేవు..
ఎయిర్ బేస్లోకి ప్రవేశించినా.. అధ్యక్షుడు వాడే విమానాల వద్దకు అతడు చేరుకోలేదని అధికారులు వివరించారు. దుండగుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం.. వైట్హౌస్కు 24 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉంది. తాజా ఉదంతాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ మీడియా కార్యదర్శి 'జాన్ కిర్బీ' శుక్రవారం పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అమెరికాను బలహీనం చేయడమే చైనా లక్ష్యం'