అమెరికాలో ఓ అంశమై నిరసన చేపడుతున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కెంటుక్కి రాష్ట్రంలోని లూయిస్ విల్లేలో ఈ ఘటన జరిగింది.
మార్చిలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా ఆందోళన చేపట్టారు నిరసనకారులు. వీరిని చెదరగొట్టేందుకే పోలీసులు కాల్పులు జరిపారు.
ఇదీ నేపథ్యం..
మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు కోసం మార్చిలో మృతురాలి ఇంటికి వెళ్లిన పోలీసులు తలుపులపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో తలుపు వెనక ఉన్న వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాడు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులపై కేసు పెట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల వైఖరికి నిరసనగా మృతురాలి సహచరులు ర్యాలీ తీశారు. ఈ నిరసనల్లోనే తాజా ఘర్షణ చెలరేగింది.