నైజీరియా ఉత్తర బోరో రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 40 మంది రైతులు మరణించారు. గరిన్-వాషిబి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
మృతుల్లో మత్స్య కారులు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోకో హారమ్ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్పందించారు. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు సైన్యానికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టంచేశారు.
బోకో హారమ్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని ఇటీవల బోర్నో రైతులు బంధించి, సైన్యానికి అప్పగించారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానిక అడ్వకేట్ తెలిపారు.
ఇదీ చదవండి: అఫ్గానిస్థాన్లో ఆత్మాహుతి దాడులు- 34 మంది మృతి