ETV Bharat / ghmc-2020

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్​ రెడ్డి

author img

By

Published : Nov 25, 2020, 4:37 AM IST

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని మల్కాజిగిరి రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మేడల జ్యోతి గౌడ్​కు మద్దతుగా రోడ్డు షో నిర్వహించారు.

mp revanth reddy campaign in ghmc elections in medchal district
మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్​ రెడ్డి

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మేడల జ్యోతి గౌడ్​కు మద్దతుగా రోడ్డు షో నిర్వహించారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని అన్నారు.

తెరాస కార్పొరేటర్లు పేదవాడు ఇల్లు కట్టుకుంటే కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. వరద సాయం ఇంటికి 50 వేలు ఇస్తామని చెప్పారు. తెరాస నాయకులు వరద సహాయాన్ని దండుకున్నారని విమర్శించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్​ గెలిపించాలని కోరారు. తనకు తోడుగా కాంగ్రెస్​ అభ్యర్థులకు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్​ రెడ్డి

ఇదీ చదవండి: హైదరాబాద్‌ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా: కేటీఆర్​

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మేడల జ్యోతి గౌడ్​కు మద్దతుగా రోడ్డు షో నిర్వహించారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని అన్నారు.

తెరాస కార్పొరేటర్లు పేదవాడు ఇల్లు కట్టుకుంటే కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. వరద సాయం ఇంటికి 50 వేలు ఇస్తామని చెప్పారు. తెరాస నాయకులు వరద సహాయాన్ని దండుకున్నారని విమర్శించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్​ గెలిపించాలని కోరారు. తనకు తోడుగా కాంగ్రెస్​ అభ్యర్థులకు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్​ రెడ్డి

ఇదీ చదవండి: హైదరాబాద్‌ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.