Salman khan venkatesh movie: సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న చిత్రం 'కభీ ఈద్ కభీ దివాళి'. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ముంబయిలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. అయితే ఈ సినిమాలో హీరో వెంకటేష్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆయన ఈ పాత్ర కోసం జూన్లో సెట్లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. కథలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని, చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంటుందని ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో విడుదల చేయాలని సన్నద్ధమవుతున్నారు.
కాగా, ఈ చిత్రం ప్రస్తుతం విలే పార్లేలో వేసిన మెట్రో రైల్ సెట్లో సల్మాన్పై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరో పదిరోజుల పాటు ఇక్కడే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని, ఇది పూర్తయిన వెంటనే సల్మాన్ 'ఇఫీ' అవార్డుల కోసం దుబాయ్కు వెళ్లనున్నారని తెలిసింది. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆయుష్ శర్మ, షెహనాజ్ గిల్, రాఘవ్, జహీర్ ఇక్బాల్ కీలక పాత్రలు పోషించనున్నారు.
Vijay vamshipaidipalli movie rashmika: హీరోయిన్ రష్మిక జోరు కొనసాగిస్తోంది. 'పుష్ప'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తమిళ హీరో విజయ్తో కలిసి నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇప్పుడీ సెట్లోకి రష్మిక అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది.
"మేకప్ పూర్తి చేసుకొని షూట్కు సిద్ధంగా ఉన్నా. అప్పుడే సెట్లో నుంచి పిలుపొచ్చింది. లోపలికివెళ్లి విజయ్, వంశీతో పాటు ఇతర చిత్ర బృందాన్ని కలిశాను. రోజంతా వారితో గడపడం చాలా బాగుంది. హ్యాపీ హ్యాపీ" అంటూ విజయ్తో సెట్లో తొలిరోజు అనుభవాలను ప్రత్యేకంగా పంచుకుంది రష్మిక. ఈ సినిమా చిత్రీకరణ మరికొన్ని వారాల పాటు హైదరాబాద్లోనే కొనసాగనుంది. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. కొత్తదనం నిండిన కథాంశంతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చే యాక్షన్ ఎంటర్టైనర్లా సినిమా ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఈ యువ హీరోలు.. టాలీవుడ్ 'గూఢచారులు'