ETV Bharat / entertainment

100 టికెట్లతో సలార్ మిడ్​నైట్ షోకు యంగ్ హీరో రెడీ- జక్కన్న బోణీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 5:10 PM IST

Salaar Movie Tickets Booking : మరో ఆరు రోజుల్లో సలార్ సందడి మొదలుకానుంది. అయితే హైదరాబాద్​లోని శ్రీరాములు థియేటర్​లో అర్థరాత్రి ఒంటిగంట షోకు వెళ్లనున్నట్లు యంగ్ హీరో నిఖిల్ ప్రకటించారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో తొలి టికెట్​ను దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. ఆ సంగతులు మీకోసం.

Salaar Movie Tickets Booking
Salaar Movie Tickets Booking

Salaar Movie Tickets Booking : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులతో పాటు నటీనటులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సలార్‌'. పాన్​ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మిడ్​నైట్ షోకు వెళ్తున్నా: నిఖిల్
అయితే హైదరాబాద్​ మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్​లో సలార్​ సినిమా ప్రదర్శితమవ్వనుంది. డిసెంబర్​ 21వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు మిడ్​నైట్ షో వేయనున్నారు. అయితే ఈ షోకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున్న సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. ఇటీవలే యంగ్‌ హీరో నిఖిల్‌ తాను శ్రీరాములు థియేటర్​లో అర్థరాత్రి ఒంటి గంట షోకు హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.

100 టికెట్లు ఫ్రీ!
అంతే కాకుండా ఆ షోకు తాను 100టికెట్లను ప్రభాస్‌ అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా నిఖిల్​ పేర్కొన్నారు. "పదేళ్ల క్రితం మిర్చి సినిమాను అదే శ్రీరాములు థియేటర్​లో అర్థరాత్రి షో చూశాను. ఇప్పుడు మళ్లీ వందమంది ప్రభాస్ అభిమానులతో కలిసి సలార్ సినిమాను చూడబోతున్నాను" అని ఎక్స్​(ట్విట్టర్​) లో ప్రకటించారు. హీరో నిఖిల్‌ చేసిన ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

టికెట్ల అమ్మకాలు షురూ!
అయితే అన్ని రాష్ట్రాల్లో సలార్‌ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్టార్ట్‌ అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్టార్ట్‌ కాలేదు. సలార్‌ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్‌ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్‌ కోరిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

బోణీ చేసిన జక్కన్న!
సలార్ విడుదల సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్‌లలో సలార్‌ టీమ్‌ కొంచెం నెమ్మదిగానే ఉంది. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళిని తెరపైకి తెచ్చింది మూవీ టీమ్‌. అందులో భాగంగా సలార్‌ మొదటి టికెట్‌ను స్టార్​ డైరెక్టర్​ ఎస్ఎస్​ రాజమౌళి కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లోని ఉదయం 7గంటల ఆటకు టికెట్‌ను ఆయన కొన్నారని మైత్రీ మేకర్స్‌ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసింది. ఇండియా బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సినిమా మొదటి టికెట్‌ను రాజమౌళి కొన్నారని క్యాప్షన్‌ ఇచ్చింది.

అయితే త్వరలో జక్కన్నతో ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ఇంటర్వ్యూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో సలార్​పై పాన్‌ ఇండియా రేంజ్‌ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి సలార్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

నా కెరీర్​లో 'సలార్​' లాంటి రోల్​ చేయలేదు- దాని కోసం ఆరు నెలలు ఎదురుచూశా : ప్రభాస్

కనీవినీ ఎరుగని రీతిలో ప్రభాస్​కు 'ఎయిర్ సెల్యూట్'​- రెబల్​ స్టార్​ ఫ్యాన్స్​ వినూత్న ప్రదర్శన

Salaar Movie Tickets Booking : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులతో పాటు నటీనటులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సలార్‌'. పాన్​ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మిడ్​నైట్ షోకు వెళ్తున్నా: నిఖిల్
అయితే హైదరాబాద్​ మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్​లో సలార్​ సినిమా ప్రదర్శితమవ్వనుంది. డిసెంబర్​ 21వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు మిడ్​నైట్ షో వేయనున్నారు. అయితే ఈ షోకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున్న సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. ఇటీవలే యంగ్‌ హీరో నిఖిల్‌ తాను శ్రీరాములు థియేటర్​లో అర్థరాత్రి ఒంటి గంట షోకు హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.

100 టికెట్లు ఫ్రీ!
అంతే కాకుండా ఆ షోకు తాను 100టికెట్లను ప్రభాస్‌ అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా నిఖిల్​ పేర్కొన్నారు. "పదేళ్ల క్రితం మిర్చి సినిమాను అదే శ్రీరాములు థియేటర్​లో అర్థరాత్రి షో చూశాను. ఇప్పుడు మళ్లీ వందమంది ప్రభాస్ అభిమానులతో కలిసి సలార్ సినిమాను చూడబోతున్నాను" అని ఎక్స్​(ట్విట్టర్​) లో ప్రకటించారు. హీరో నిఖిల్‌ చేసిన ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

టికెట్ల అమ్మకాలు షురూ!
అయితే అన్ని రాష్ట్రాల్లో సలార్‌ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్టార్ట్‌ అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్టార్ట్‌ కాలేదు. సలార్‌ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్‌ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్‌ కోరిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

బోణీ చేసిన జక్కన్న!
సలార్ విడుదల సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్‌లలో సలార్‌ టీమ్‌ కొంచెం నెమ్మదిగానే ఉంది. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళిని తెరపైకి తెచ్చింది మూవీ టీమ్‌. అందులో భాగంగా సలార్‌ మొదటి టికెట్‌ను స్టార్​ డైరెక్టర్​ ఎస్ఎస్​ రాజమౌళి కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లోని ఉదయం 7గంటల ఆటకు టికెట్‌ను ఆయన కొన్నారని మైత్రీ మేకర్స్‌ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసింది. ఇండియా బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సినిమా మొదటి టికెట్‌ను రాజమౌళి కొన్నారని క్యాప్షన్‌ ఇచ్చింది.

అయితే త్వరలో జక్కన్నతో ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ఇంటర్వ్యూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో సలార్​పై పాన్‌ ఇండియా రేంజ్‌ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి సలార్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

నా కెరీర్​లో 'సలార్​' లాంటి రోల్​ చేయలేదు- దాని కోసం ఆరు నెలలు ఎదురుచూశా : ప్రభాస్

కనీవినీ ఎరుగని రీతిలో ప్రభాస్​కు 'ఎయిర్ సెల్యూట్'​- రెబల్​ స్టార్​ ఫ్యాన్స్​ వినూత్న ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.