ETV Bharat / elections

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 95 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓటింగ్​ జరుగుతోంది.

author img

By

Published : Apr 18, 2019, 7:28 AM IST

Updated : Apr 18, 2019, 7:35 AM IST

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం

11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతలోని మొత్తం 95 లోక్​సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 1600 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని 15.79 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనునున్నారు.

ఛత్తీస్​గఢ్​ నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ పోలింగ్​ ప్రారంభమైంది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.

తమిళనాడులో 38 లోక్​సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 18 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

రెండో దశ పోలింగ్​లో లోక్​సభకు ప్రముఖులు బరిలో ఉన్నారు. కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్​, సదానంద గౌడ, పొన్​ రాధాకృష్ణ, కర్ణాటక నుంచి మాజీ ప్రధాని హెచ్​ డి దేవగౌడ, తమిళనాడు నుంచి ఏ రాజా, కనిమొళి పోటీలో ఉన్నారు.

మొత్తం ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే 19న తుది దశ పోలింగ్​తో ముగుస్తాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం

11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతలోని మొత్తం 95 లోక్​సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 1600 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని 15.79 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనునున్నారు.

ఛత్తీస్​గఢ్​ నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ పోలింగ్​ ప్రారంభమైంది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.

తమిళనాడులో 38 లోక్​సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 18 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

రెండో దశ పోలింగ్​లో లోక్​సభకు ప్రముఖులు బరిలో ఉన్నారు. కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్​, సదానంద గౌడ, పొన్​ రాధాకృష్ణ, కర్ణాటక నుంచి మాజీ ప్రధాని హెచ్​ డి దేవగౌడ, తమిళనాడు నుంచి ఏ రాజా, కనిమొళి పోటీలో ఉన్నారు.

మొత్తం ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే 19న తుది దశ పోలింగ్​తో ముగుస్తాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

సార్వత్రిక రెండోదశ పోలింగ్​ ప్రారంభం
Varanasi (UP), Apr 18 (ANI): Locals of Varanasi gave mixed reviews on construction of Kashi Vishwanath Corridor project. This project is one of the dream projects of Prime Minister Narendra Modi. It's construction is in full swing. One of the locals said, "Today, we are facing problems due to it but in future it'll help people who visit the temple."
Last Updated : Apr 18, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.