ETV Bharat / crime

ROAD ACCIDENT: ఓవర్​టేక్ చేయబోయి అదుపుతప్పిన కారు.. ఇద్దరు మృతి - తెలంగాణ వార్తలు

లారీని ఓవర్​టేక్ చేస్తూ కారు అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. యువకులు మద్యం సేవించి కారును నడిపినట్లుగా పోలీసులు తెలిపారు.

road accident, two dead
రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
author img

By

Published : Jun 26, 2021, 12:24 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఆలూరుకు చెందిన శ్రవణ్ (22), కొండాపూర్​కు చెందిన నవీన్(30)గా గుర్తించారు. కౌకుంట్లకు చెందిన మహేందర్ రెడ్డి, ఉదయ్ కిరణ్​లు గాయాల పాలయ్యారు.

యువకులు మద్యం సేవించి కారును అతివేగంగా నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. లారీని ఓవర్​టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని మృతదేహాలను గంటపాటుు జేసీబీతో శ్రమించి బయటకు తీశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్ననట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఆలూరుకు చెందిన శ్రవణ్ (22), కొండాపూర్​కు చెందిన నవీన్(30)గా గుర్తించారు. కౌకుంట్లకు చెందిన మహేందర్ రెడ్డి, ఉదయ్ కిరణ్​లు గాయాల పాలయ్యారు.

యువకులు మద్యం సేవించి కారును అతివేగంగా నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. లారీని ఓవర్​టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని మృతదేహాలను గంటపాటుు జేసీబీతో శ్రమించి బయటకు తీశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్ననట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.