ETV Bharat / crime

accident: స్కూటీపై పడిన కంటైనర్‌​.. ఇద్దరు మృతి - రంగారెడ్డి జిల్లా షాబాద్​లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్​నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ బోల్తాపడి... పక్కన వెళ్తున్న స్కూటీపై పడింది. ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.

accident
accident
author img

By

Published : Sep 9, 2021, 2:06 PM IST

కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం బలిగొంది. ఈ ఘటన బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌లో చోటుచేసుకుంది. షాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న కంటెయినర్‌ అతివేగంగా వెళ్తూ... బోల్తాకొట్టి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులపై పడింది. దీంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు కక్కులూరుకు చెందిన ముట్పూరు విక్రాంత్‌ (19), పాపిరెడ్డిగూడెంనకు చెందిన పవన్‌(18)లుగా గుర్తించారు. వారిలో ఒకరు బైక్‌ మెకానిక్‌, మరొకరు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం లారీ డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పారిపోయినట్లు సమాచారం.

కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం బలిగొంది. ఈ ఘటన బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌లో చోటుచేసుకుంది. షాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న కంటెయినర్‌ అతివేగంగా వెళ్తూ... బోల్తాకొట్టి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులపై పడింది. దీంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు కక్కులూరుకు చెందిన ముట్పూరు విక్రాంత్‌ (19), పాపిరెడ్డిగూడెంనకు చెందిన పవన్‌(18)లుగా గుర్తించారు. వారిలో ఒకరు బైక్‌ మెకానిక్‌, మరొకరు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం లారీ డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పారిపోయినట్లు సమాచారం.

ఇదీ చూడండి: ACCIDENT: అమెరికాకు వెళ్లాల్సినవాడు.. అనంతలోకాలకు చేరాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.