ETV Bharat / crime

మద్యం మత్తులో వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం - telangana news

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న వారి బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ని వేగంగా ఢీ కొట్టింది. ఆ వేగానికి గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు మృత్యువాత పడ్డ దృశ్యాలు.. సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

Two died in road accident due to alcohol intoxication at medchal
మద్యం మత్తులో వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం
author img

By

Published : Feb 4, 2021, 6:45 PM IST

మద్యం మత్తులో అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​లో చోటుచేసుకుంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గండిమైసమ్మ వైపు మనోజ్, దినేష్ సాయి అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మద్యం మత్తులో వేగంగా వెళ్తున్న క్రమంలో.. వారు అదుపుతప్పి డివైడర్‌ని బలంగా ఢీ కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

సీసీ కెమెరాలో రోడ్డు ప్రమాద దృశ్యాలు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అంబులెన్స్​లో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్రవాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ స్థానికంగా ఓ హోటల్​లో పనిచేస్తుండగా... దినేష్ సాయి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఘటనపై దుండిగల్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆటోను ఢీకొన్న వ్యాన్​.. ముగ్గురు దుర్మరణం

మద్యం మత్తులో అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​లో చోటుచేసుకుంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గండిమైసమ్మ వైపు మనోజ్, దినేష్ సాయి అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మద్యం మత్తులో వేగంగా వెళ్తున్న క్రమంలో.. వారు అదుపుతప్పి డివైడర్‌ని బలంగా ఢీ కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

సీసీ కెమెరాలో రోడ్డు ప్రమాద దృశ్యాలు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అంబులెన్స్​లో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్రవాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ స్థానికంగా ఓ హోటల్​లో పనిచేస్తుండగా... దినేష్ సాయి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఘటనపై దుండిగల్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆటోను ఢీకొన్న వ్యాన్​.. ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.