ETV Bharat / crime

FAKE LIQUOR: మన్యంలో మరణఘోష.. అమాయకుల ప్రాణాలు హరిస్తున్న కల్తీకల్లు..

వారంతా అమాయక గిరిజనులు. కాయకష్టం తప్ప వాళ్లకి మరో విషయం తెలియదు. వ్యసనాలకు బానిసై ఆరోగ్యాలను గుల్ల చేసుకుంటున్నారు. కిక్కు కోసం కల్లు తాగుతూ మంచాన పడుతున్నారు. ఎవరైనా చనిపోతే అధికారుల హడావుడి తప్ప వాళ్లను పట్టించుకుని.. సమస్యలను పరిష్కరించే నాథుడే కరవుయ్యాడు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజగొమ్మండి మండలంలో జీలుగు కల్లు తాగి ఐదుగురు చనిపోవడంతో.. మరోసారి మన్యమంతా ఉలిక్కిపడింది.

author img

By

Published : Feb 3, 2022, 3:29 PM IST

FAKE LIQUOR
FAKE LIQUOR

ఏపీలోని తూర్పు మన్యంలో.. దశాబ్దాలుగా మరణ ఘోష వినిపిస్తోంది.. ఆయా మరణాలకు వ్యసనాలు, అనారోగ్య పరిస్థితులే కారణాలుగా కనిపిస్తున్నాయి. చావుకేక వినిపించినప్పుడు హడావుడి తప్ఫ.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చొరవే కరవవుతోంది.. కాయకష్టమే తెలిసిన అమాయక గిరిజనం ఆరోగ్యం.... వ్యసనాలకు బానిసై గుల్లవుతోంది.. కొందరు అనారోగ్యంతో మంచాన పడితే.. మరికొందరు అర్ధంతరంగా తనువు చాలించడం కలవరపెడుతోంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మృత్యువాత పడటంతో తూర్పు మన్యం మరోసారి ఉలిక్కిపడింది.

అసలు ఏం జరుగుంటుంది?...

రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డిలో ఐదుగురి ఉసురు తీసిన ఘటనపై పోలీసు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో, వైద్యారోగ్యశాఖ, అబ్కారీ, రెవెన్యూ ఇతర శాఖలు లోతుగా దృష్టిసారించాయి. చెట్టులో కల్లు ఉన్నప్పుడు విష ప్రయోగం జరిగిందా..? కీటకాల ప్రభావంతో విషపూరితం అయిందా..? తీసి కాచి తాగే క్రమంలో ఏమైనా లోపాలు చోటుచేసుకున్నాయా..? అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది. నమూనాలు పరీక్షించి ప్రాథమిక నివేదిక వెల్లడైతే లోదొడ్డిలో మృత్యుఘోషపై స్పష్టత వచ్చే వీలుంది. అయిదుగురి ఉసురు తీసిన జీలుగు కల్లు నమూనాలు యంత్రాంగం సేకరించింది. కాకినాడలోని అబ్కారీ శాఖ ప్రాంతీయ పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాత.. కారణాలపై స్పష్టత వచ్చేవీలుందని అబ్కారీశాఖ డీసీ చైతన్యమురళి తెలిపారు.

మన్యంలో నాటుసారా, గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ‘పరివర్తన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐటీడీఏ, ఐసీడీఎస్‌, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రూ.కోట్లు ఖర్చవుతున్నా.. ఆయా శాఖల చొరవ ఫలితం అంతగా కనిపించడంలేదు. తూర్పుగోదావరి జిల్లా 36 మండలాల్లో నాటుసారా, కల్లు మత్తు తీవ్రత ఉంది.

కుట్రకోణమా..?

కిక్కు కోసం కల్లులో కలిపిన బెరడులు వికటించాయా? ఇతర కుట్ర కోణమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ వాలంటీరుకు మృతుల కుటుంబాల మధ్య వైరుధ్యమూ కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విష ప్రయోగం జరిగిందా..? అనే వాదన వస్తోంది. కల్లు కుండ నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడంతో ఎవరో ఏదో కలిపి ఉంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

మరింత లోతుగా విచారణ...

" ఈ ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించాం. జిల్లా ఎస్పీ.. ప్రత్యేక దృష్టిసారించారు. ప్రాథమిక నివేదిక కోసం నమూనాలను జిల్లాలో ప్రయోగశాలలో పరీక్షిస్తాం. ఇదే క్రమంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కూ పంపిస్తాం. చెట్టునుంచి తీసిన కల్లు తాగితే మరణాలకు ఆస్కారంలేదు. కానీ.. తెరవెనుక నేర కోణం ఉందనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేయిస్తున్నాం." - హరికిరణ్‌, కలెక్టర్‌

కిక్కు కోసం తాగుతూ....

నాటుసారా: మన్యంలో తయారయ్యే నాటుసారాలో... బ్యాటరీల్లో వాడే కార్బన్‌, పంటలకు ఎరువుగా వేసే యూరియా గతంలో వాడేవారు. యూరియా వేపనూనె మిశ్రమంతో వస్తుండటంతో ఇప్పుడు డీఏపీ, ఇతరాలు కలుపుతున్నారు. సాధారణ మద్యంలో ఆల్కహాల్‌ 60 నుంచి 70 శాతం ఉంటే.. ఇక్కడ వీళ్లు తయారుచేసే నాటు సారాలో 100 శాతం ఉంటోంది. సుదీర్ఘ కాలం తాగడంతో శరీర భాగాలు దెబ్బతింటున్నాయి.

కల్లు: మన్యంలో గిరిజనానికి సారాతోపాటు తాటి, ఈత, జీలుగు కల్లు.. తాటి చిగురు తాగడం అలవాటు.జీలుగు చెట్టు నుంచి వచ్చే కల్లు నేరుగా తాగకుండా.. కిక్కు కోసం రెల్ల, గీసరి, ఇండుగ చెట్టు బెరడులు అందులో వేస్తారు. వీటి రసం కల్లులోకి దిగితే కిక్కు ఎక్కుతుందని వీటిని కలుపుతారు.

ఏపీలోని తూర్పు మన్యంలో.. దశాబ్దాలుగా మరణ ఘోష వినిపిస్తోంది.. ఆయా మరణాలకు వ్యసనాలు, అనారోగ్య పరిస్థితులే కారణాలుగా కనిపిస్తున్నాయి. చావుకేక వినిపించినప్పుడు హడావుడి తప్ఫ.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చొరవే కరవవుతోంది.. కాయకష్టమే తెలిసిన అమాయక గిరిజనం ఆరోగ్యం.... వ్యసనాలకు బానిసై గుల్లవుతోంది.. కొందరు అనారోగ్యంతో మంచాన పడితే.. మరికొందరు అర్ధంతరంగా తనువు చాలించడం కలవరపెడుతోంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మృత్యువాత పడటంతో తూర్పు మన్యం మరోసారి ఉలిక్కిపడింది.

అసలు ఏం జరుగుంటుంది?...

రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డిలో ఐదుగురి ఉసురు తీసిన ఘటనపై పోలీసు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో, వైద్యారోగ్యశాఖ, అబ్కారీ, రెవెన్యూ ఇతర శాఖలు లోతుగా దృష్టిసారించాయి. చెట్టులో కల్లు ఉన్నప్పుడు విష ప్రయోగం జరిగిందా..? కీటకాల ప్రభావంతో విషపూరితం అయిందా..? తీసి కాచి తాగే క్రమంలో ఏమైనా లోపాలు చోటుచేసుకున్నాయా..? అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది. నమూనాలు పరీక్షించి ప్రాథమిక నివేదిక వెల్లడైతే లోదొడ్డిలో మృత్యుఘోషపై స్పష్టత వచ్చే వీలుంది. అయిదుగురి ఉసురు తీసిన జీలుగు కల్లు నమూనాలు యంత్రాంగం సేకరించింది. కాకినాడలోని అబ్కారీ శాఖ ప్రాంతీయ పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాత.. కారణాలపై స్పష్టత వచ్చేవీలుందని అబ్కారీశాఖ డీసీ చైతన్యమురళి తెలిపారు.

మన్యంలో నాటుసారా, గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ‘పరివర్తన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐటీడీఏ, ఐసీడీఎస్‌, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రూ.కోట్లు ఖర్చవుతున్నా.. ఆయా శాఖల చొరవ ఫలితం అంతగా కనిపించడంలేదు. తూర్పుగోదావరి జిల్లా 36 మండలాల్లో నాటుసారా, కల్లు మత్తు తీవ్రత ఉంది.

కుట్రకోణమా..?

కిక్కు కోసం కల్లులో కలిపిన బెరడులు వికటించాయా? ఇతర కుట్ర కోణమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ వాలంటీరుకు మృతుల కుటుంబాల మధ్య వైరుధ్యమూ కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విష ప్రయోగం జరిగిందా..? అనే వాదన వస్తోంది. కల్లు కుండ నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడంతో ఎవరో ఏదో కలిపి ఉంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

మరింత లోతుగా విచారణ...

" ఈ ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించాం. జిల్లా ఎస్పీ.. ప్రత్యేక దృష్టిసారించారు. ప్రాథమిక నివేదిక కోసం నమూనాలను జిల్లాలో ప్రయోగశాలలో పరీక్షిస్తాం. ఇదే క్రమంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కూ పంపిస్తాం. చెట్టునుంచి తీసిన కల్లు తాగితే మరణాలకు ఆస్కారంలేదు. కానీ.. తెరవెనుక నేర కోణం ఉందనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేయిస్తున్నాం." - హరికిరణ్‌, కలెక్టర్‌

కిక్కు కోసం తాగుతూ....

నాటుసారా: మన్యంలో తయారయ్యే నాటుసారాలో... బ్యాటరీల్లో వాడే కార్బన్‌, పంటలకు ఎరువుగా వేసే యూరియా గతంలో వాడేవారు. యూరియా వేపనూనె మిశ్రమంతో వస్తుండటంతో ఇప్పుడు డీఏపీ, ఇతరాలు కలుపుతున్నారు. సాధారణ మద్యంలో ఆల్కహాల్‌ 60 నుంచి 70 శాతం ఉంటే.. ఇక్కడ వీళ్లు తయారుచేసే నాటు సారాలో 100 శాతం ఉంటోంది. సుదీర్ఘ కాలం తాగడంతో శరీర భాగాలు దెబ్బతింటున్నాయి.

కల్లు: మన్యంలో గిరిజనానికి సారాతోపాటు తాటి, ఈత, జీలుగు కల్లు.. తాటి చిగురు తాగడం అలవాటు.జీలుగు చెట్టు నుంచి వచ్చే కల్లు నేరుగా తాగకుండా.. కిక్కు కోసం రెల్ల, గీసరి, ఇండుగ చెట్టు బెరడులు అందులో వేస్తారు. వీటి రసం కల్లులోకి దిగితే కిక్కు ఎక్కుతుందని వీటిని కలుపుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.