లిఫ్ట్ అడిగి... పోలీసునని బెదిరించి ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తిని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. సీతాఫల్మండిలో నివాసముండే విద్యార్థి అరవింద్ మార్చి నెలాఖరున తన బైక్పై సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో జనగామకు చెందిన బాలరాజు లిఫ్ట్ అడిగాడని పోలీసులు తెలిపారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ వద్దకు రాగానే పోలీసునని బెదిరించి వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్లాడని పేర్కొన్నారు.
బాలరాజు ద్విచక్రవాహనంపై శుక్రవారం ఉదయం చిలకలగూడ చౌరస్తా మీదుగా వెళ్తుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని నిలిపి పత్రాలను అడిగినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించామని వివరించారు.
ఇదీ చదవండి: డీఎంకే ఎంపీ కనిమొళికి కరోనా