ETV Bharat / crime

Road Accident: ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Jan 15, 2022, 2:58 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Road accident in Chittoor
Road accident in Chittoor

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఐదో మైలు వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ముగ్గురూ మృతిచెందారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఇస్మాయిల్, సిద్దిక్ వాల్మీకీపురం మండలం చింతపర్తివాసులు కాగా.. శ్రీనివాసులు స్వగ్రామం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఐదో మైలు వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ముగ్గురూ మృతిచెందారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఇస్మాయిల్, సిద్దిక్ వాల్మీకీపురం మండలం చింతపర్తివాసులు కాగా.. శ్రీనివాసులు స్వగ్రామం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి: రైలు పట్టాలపై కాంక్రీట్ స్తంభం- కుట్రపూరితంగానే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.