ETV Bharat / crime

రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం.. 5 లక్షలు స్వాహా.. - నిజామాబాద్ తాజా క్రైమ్ వార్తలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వస్త్ర దుకాణాల్లో దొంగతనం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

theft at two cloth stores in nizamabad
రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం
author img

By

Published : May 22, 2021, 10:43 AM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో గల సురేష్ క్లాత్, విట్టల్ క్లాత్ వస్త్ర దుకాణాల్లో శుక్రవారం దొంగతనం జరిగింది. లాక్​డౌన్ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే దుకాణాన్ని మూసివేసి వెళ్లిన యజమాని ఈరోజు ఉదయం వచ్చి చూసేసరికి షాపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా... వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి.

రెండు దుకాణాల్లోని లాకర్లలోంచి దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయంటూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వన్​టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో గల సురేష్ క్లాత్, విట్టల్ క్లాత్ వస్త్ర దుకాణాల్లో శుక్రవారం దొంగతనం జరిగింది. లాక్​డౌన్ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే దుకాణాన్ని మూసివేసి వెళ్లిన యజమాని ఈరోజు ఉదయం వచ్చి చూసేసరికి షాపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా... వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి.

రెండు దుకాణాల్లోని లాకర్లలోంచి దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయంటూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వన్​టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.