ETV Bharat / crime

'ఫోన్​ చేసి రమ్మన్నాడు.. శవమై తేలాడు'

author img

By

Published : Feb 25, 2021, 7:02 PM IST

ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వాళ్లు వచ్చే సరికి అతని ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలో శవమై తేలాడు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

'ఫోన్​ చేసి రమ్మన్నాడు.. శవమై తేలాడు'
'ఫోన్​ చేసి రమ్మన్నాడు.. శవమై తేలాడు'

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్​లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పొన్నకల్​కు చెందిన శ్రీనివాసులు(32) బుధవారం సాయంత్రం తన చిన్న కుమార్తెకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారి వెంట వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం గ్రామసమీపంలో ఉన్న చెరువు కట్టపై శ్రీనివాసుల మృతదేహం లభ్యమైంది.

మొహంపై గాయాలు ఉండటంతో కుమార్తెలు అనుమానం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్​లో భార్య ఉరేసుకుని మృతి చెందగా.. ఇప్పుడు శ్రీనివాసులు అనుమానస్పదంగా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్​లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పొన్నకల్​కు చెందిన శ్రీనివాసులు(32) బుధవారం సాయంత్రం తన చిన్న కుమార్తెకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారి వెంట వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం గ్రామసమీపంలో ఉన్న చెరువు కట్టపై శ్రీనివాసుల మృతదేహం లభ్యమైంది.

మొహంపై గాయాలు ఉండటంతో కుమార్తెలు అనుమానం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్​లో భార్య ఉరేసుకుని మృతి చెందగా.. ఇప్పుడు శ్రీనివాసులు అనుమానస్పదంగా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.