సంగారెడ్డి జిల్లా జిన్నారంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నారాయణ, అతని భార్య రాజేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో కంది మండల కేంద్రంలోని ఓ మామిజడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలొదిలారు.
మామిడి తోట సమీపంలో నారాయణ కారు ఉండటం వల్ల అనుమానం వచ్చిన అతని మిత్రులు తోటలో వెతకగా.. చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నారాయణ పెద్ద కూతురు వివాహం కుదిర్చిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. నారాయణ విధులు నిర్వర్తించిన ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నారని.. పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: మద్యం దుకాణాల ఎదుట ముందుబాబులు క్యూ