ETV Bharat / crime

మెరిసేదంతా బంగారమే అనుకున్న RMP.. రూ.20 లక్షలు పోగొట్టుకుంటే గానీ..!

author img

By

Published : Jan 13, 2023, 5:50 PM IST

Cheated With Fake Gold: ఆయన కాస్తో కూస్తో పేరున్న ఆర్​ఎంపీ డాక్టర్​. రోగాల బారిన ప్రజలు పడకుండా వారికి తగు జాగ్రత్తలు చెబుతూ ఆ చుట్టు పక్కల మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఓ రోజు రోగుల్లాగా తన దగ్గరకు వచ్చిన ఓ దంపతుల మాటలు విని మోసపోయాడు. ఏకంగా రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Cheated With Fake Gold
Cheated With Fake Gold

Cheated With Fake Gold: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తమ్మలూరు గ్రామానికి చెందిన సీతారామ స్వామి ఆర్ఎంపీగా ముండ్లమూరు గ్రామంలో స్థిరపడ్డారు. వైద్య వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తి వైద్యం కనుక ప్రవృత్తిగా అందరితో కలిసి మెలసి ఉంటాడు. ఇలా అనుకోకుండా.. గత ఏడాది ఏప్రిల్ నెలలో చికిత్స కోసం కంజులు పట్టుకొని అమ్ముకొని బతుకుతెరువు సాగించే దంపతులు.. ఆయన వద్దకు వచ్చారు.

తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయాలని.. ఆ భార్యామణి డాక్టర్​ను కోరింది. అలా వైద్యం కోసం ఒక నెలలోనే నాలుగుసార్లు వైద్యుడిని కలిశారు ఆ దంపతులు. వైద్యం కోసం వచ్చినప్పుడల్లా, కంజుపిట్టలని ఫ్రీగా ఇచ్చేవారు. ఇలా వారివురి మధ్య సంబంధాలు మెరుగుపడటంతో.. ఆ దంపతులు, డాక్టర్ సీతారామ స్వామి వద్ద ఓ విషయాన్ని చెప్పారు.

అసలు కథ మొదలైంది ఇలా..: చికిత్స కోసం పలుమార్లు వచ్చిన ఆ గుర్తు తెలియని దంపతులు.. సీతారామస్వామికి ఓ రహస్యాన్ని చెప్పారు. తమ బంధువుల పిల్లోడు కేరళలో ప్రొక్లెయిన్​ ఆపరేటర్​గా పని చేస్తుంటాడని.. అతనికి అనుకోకుండా కొంత బంగారం దొరికిందని తెలిపారు. ఆ అబ్బాయికి భయమేసి బంగారాన్ని అమ్మిపెట్టమని.. కోరాడని ఆ దంపతులు వైద్యుడికి వివరించారు. ఆ దొంగ బంగారాన్ని ఎక్కడ అమ్మాలన్నా ఇబ్బందిగా ఉందని.. మీరు తీసుకుంటే తక్కువ ధరకు ఇప్పిస్తామని వారు చెప్పారు. దీంతో ఆర్ఎంపీ ముఖం వెలిగిపోయింది. ఆ బంగారాన్ని తనకే ఇవ్వాలని.. మీరు బయట ఎక్కడ అమ్మినా ప్రమాదమని హెచ్చరించాడు.

దీంతో ఒకరికొకరు విశ్వాసం నెలకొల్పే మాటలు మాట్లాడుకున్నారు. డబ్బులు సిద్దం చేసుకుంటే.. ఆ బంగారాన్ని తమకే ఇచ్చేస్తామని.. ఆ దంపతులు చివరిమాటలుగా చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తరువాత చౌకగా వస్తున్న ఆ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు సుమారు రూ.20 లక్షలు సిద్ధం చేసుకున్న ఆర్ఎంపీ.. ఆ దంపతులు ఇచ్చి వెళ్లిన చారవాణికి ఫోన్ చేశాడు. వారు వెంటనే స్పందించి.. బంగారంతో తాము సిద్దంగా ఉన్నామని.. మీరు డబ్బు తీసుకొని చిత్తూరు జిల్లాలోని ఓ చెరువు వద్దకు వస్తే మీకు బంగారం ఇచ్చేస్తామని తెలిపారు. దీంతో ఆ ఆర్ఎంపీ.. తన బంధువును వెంట బెట్టుకొని వారు చెప్పిన చోటుకు వెళ్లారు.
మోసం చేసిన బంగారు పూసల దండ: పథకం ప్రకారం ముందే అక్కడ ఉన్న యువకుడు వీరు వెళ్లగానే ఓ మూటతో వచ్చి సంచిలో నుంచి ఓ బంగారు పూసను తీసి పరిశీలించమని చెప్పాడు. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని యువకుడు ఇచ్చిన బంగారుపూసని పరిశీలించి నమ్మకం కుదిరాక డబ్బు అతని చేతికిచ్చాడు. ఆ యువకుడు అతని వద్ద ఉన్న బంగారు పూసల దండలున్న మూటను వారికిచ్చి ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదంటూ.. పోలీసులు తిరుగుతున్నారని.. మీరు తొందరగా వెళ్లిపోవాలని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ మూటను తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి.. విప్పి చూస్తే అది నకిలీ బంగారం అని వైద్యుడు గుర్తించారు. వెంటనే తాను ఫోన్ చేసిన నెంబర్​కు ఫోన్ చేయగా, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్ని సార్లు చేసినా ఫోన్ నుంచి స్పందన లేకపోవడంతో.. తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో చేసేదేమీలేక ఈ నెల 9న జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్​ని కలసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

మెరిసేదంతా బంగారమే అనుకున్న ఆర్ఎంపీ.. రోగుల్లా వచ్చి రూ.20 లక్షలు కొట్టేశారు

"పోయిన సంవత్సరం ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం బాగోలేక రెండు, మూడుసార్లు వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇలా మా బంధువుల వద్ద బంగారం ఉంది అని.. తక్కువ ధరకు వస్తుందని నమ్మచెప్పి మదనపల్లె వస్తే మీకు బంగారం ఇస్తామని అన్నారు. దీంతో నేను రూ.20 లక్షలు పోగు చేసుకుని మదనపల్లె, బి.కొత్త కోట వీరంగి చెరువు వద్ద వాళ్లని కలిశాను. మొదట బంగారాన్ని చూపించి, మూటలో ఉన్నది మంచి బంగారమేనని చెప్పడంతో.. వాళ్లకి రూ.20 లక్షలు అప్పజెప్పి.. మూటలో ఉన్న బంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చి చూడగా నకిలీ బంగారమని తేలింది. ఈ నెల 9న జిల్లా ఎస్పీని కలిసి నా గోడును విన్నవించుకున్నాను." -సీతారామ స్వామి, బాధితుడు

ఇవీ చదవండి

Cheated With Fake Gold: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తమ్మలూరు గ్రామానికి చెందిన సీతారామ స్వామి ఆర్ఎంపీగా ముండ్లమూరు గ్రామంలో స్థిరపడ్డారు. వైద్య వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తి వైద్యం కనుక ప్రవృత్తిగా అందరితో కలిసి మెలసి ఉంటాడు. ఇలా అనుకోకుండా.. గత ఏడాది ఏప్రిల్ నెలలో చికిత్స కోసం కంజులు పట్టుకొని అమ్ముకొని బతుకుతెరువు సాగించే దంపతులు.. ఆయన వద్దకు వచ్చారు.

తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయాలని.. ఆ భార్యామణి డాక్టర్​ను కోరింది. అలా వైద్యం కోసం ఒక నెలలోనే నాలుగుసార్లు వైద్యుడిని కలిశారు ఆ దంపతులు. వైద్యం కోసం వచ్చినప్పుడల్లా, కంజుపిట్టలని ఫ్రీగా ఇచ్చేవారు. ఇలా వారివురి మధ్య సంబంధాలు మెరుగుపడటంతో.. ఆ దంపతులు, డాక్టర్ సీతారామ స్వామి వద్ద ఓ విషయాన్ని చెప్పారు.

అసలు కథ మొదలైంది ఇలా..: చికిత్స కోసం పలుమార్లు వచ్చిన ఆ గుర్తు తెలియని దంపతులు.. సీతారామస్వామికి ఓ రహస్యాన్ని చెప్పారు. తమ బంధువుల పిల్లోడు కేరళలో ప్రొక్లెయిన్​ ఆపరేటర్​గా పని చేస్తుంటాడని.. అతనికి అనుకోకుండా కొంత బంగారం దొరికిందని తెలిపారు. ఆ అబ్బాయికి భయమేసి బంగారాన్ని అమ్మిపెట్టమని.. కోరాడని ఆ దంపతులు వైద్యుడికి వివరించారు. ఆ దొంగ బంగారాన్ని ఎక్కడ అమ్మాలన్నా ఇబ్బందిగా ఉందని.. మీరు తీసుకుంటే తక్కువ ధరకు ఇప్పిస్తామని వారు చెప్పారు. దీంతో ఆర్ఎంపీ ముఖం వెలిగిపోయింది. ఆ బంగారాన్ని తనకే ఇవ్వాలని.. మీరు బయట ఎక్కడ అమ్మినా ప్రమాదమని హెచ్చరించాడు.

దీంతో ఒకరికొకరు విశ్వాసం నెలకొల్పే మాటలు మాట్లాడుకున్నారు. డబ్బులు సిద్దం చేసుకుంటే.. ఆ బంగారాన్ని తమకే ఇచ్చేస్తామని.. ఆ దంపతులు చివరిమాటలుగా చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తరువాత చౌకగా వస్తున్న ఆ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు సుమారు రూ.20 లక్షలు సిద్ధం చేసుకున్న ఆర్ఎంపీ.. ఆ దంపతులు ఇచ్చి వెళ్లిన చారవాణికి ఫోన్ చేశాడు. వారు వెంటనే స్పందించి.. బంగారంతో తాము సిద్దంగా ఉన్నామని.. మీరు డబ్బు తీసుకొని చిత్తూరు జిల్లాలోని ఓ చెరువు వద్దకు వస్తే మీకు బంగారం ఇచ్చేస్తామని తెలిపారు. దీంతో ఆ ఆర్ఎంపీ.. తన బంధువును వెంట బెట్టుకొని వారు చెప్పిన చోటుకు వెళ్లారు.
మోసం చేసిన బంగారు పూసల దండ: పథకం ప్రకారం ముందే అక్కడ ఉన్న యువకుడు వీరు వెళ్లగానే ఓ మూటతో వచ్చి సంచిలో నుంచి ఓ బంగారు పూసను తీసి పరిశీలించమని చెప్పాడు. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని యువకుడు ఇచ్చిన బంగారుపూసని పరిశీలించి నమ్మకం కుదిరాక డబ్బు అతని చేతికిచ్చాడు. ఆ యువకుడు అతని వద్ద ఉన్న బంగారు పూసల దండలున్న మూటను వారికిచ్చి ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదంటూ.. పోలీసులు తిరుగుతున్నారని.. మీరు తొందరగా వెళ్లిపోవాలని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ మూటను తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి.. విప్పి చూస్తే అది నకిలీ బంగారం అని వైద్యుడు గుర్తించారు. వెంటనే తాను ఫోన్ చేసిన నెంబర్​కు ఫోన్ చేయగా, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్ని సార్లు చేసినా ఫోన్ నుంచి స్పందన లేకపోవడంతో.. తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో చేసేదేమీలేక ఈ నెల 9న జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్​ని కలసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

మెరిసేదంతా బంగారమే అనుకున్న ఆర్ఎంపీ.. రోగుల్లా వచ్చి రూ.20 లక్షలు కొట్టేశారు

"పోయిన సంవత్సరం ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం బాగోలేక రెండు, మూడుసార్లు వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇలా మా బంధువుల వద్ద బంగారం ఉంది అని.. తక్కువ ధరకు వస్తుందని నమ్మచెప్పి మదనపల్లె వస్తే మీకు బంగారం ఇస్తామని అన్నారు. దీంతో నేను రూ.20 లక్షలు పోగు చేసుకుని మదనపల్లె, బి.కొత్త కోట వీరంగి చెరువు వద్ద వాళ్లని కలిశాను. మొదట బంగారాన్ని చూపించి, మూటలో ఉన్నది మంచి బంగారమేనని చెప్పడంతో.. వాళ్లకి రూ.20 లక్షలు అప్పజెప్పి.. మూటలో ఉన్న బంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చి చూడగా నకిలీ బంగారమని తేలింది. ఈ నెల 9న జిల్లా ఎస్పీని కలిసి నా గోడును విన్నవించుకున్నాను." -సీతారామ స్వామి, బాధితుడు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.