ETV Bharat / crime

Railway Constable Rescued a Woman : శెభాష్ పూనమ్.. దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి....

Railway Constable Rescued a Woman : ఓ వైపు నుంచి రైలు వస్తోంది.. మరోవైపు పట్టాలపై ఓ వ్యక్తి నిల్చున్నాడు. ఇంకో నిమిషమైతే.. ఆ రైలు వచ్చి అతన్ని ఢీకొడుతుంది. అంతలోనే మరో వ్యక్తి రైలుకు ఎదురుగా పరిగెడతాడు. వేగంగా వెళ్తున్న రైలుకు ఎదురుగా వస్తున్న అతన్ని చూసి ఇంజిన్ ఆపరేటర్ ట్రైన్​ను ఆపేస్తాడు. ఎందుకలా చేశావ్ అని అడిగితే.. పట్టాలపై నిల్చున్న వ్యక్తిని చూపిస్తాడు. అలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని.. తన ప్రాణాలకు తెగించి కాపాడతాడు. అసాధ్యుడి సినిమాలో ఓ సీన్.. ఈ రీల్​ సీన్​ రియల్​లైఫ్​లో రిపీట్ అయింది. అక్కడ చనిపోవాలనుకున్న వ్యక్తి హీరో కల్యాణ్ రామ్ కాపాడినట్లు.. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడారు.

author img

By

Published : Jan 10, 2022, 10:21 AM IST

Railway Constable Rescued a Woman
Railway Constable Rescued a Woman

Railway Constable Rescued a Woman : రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను రైల్వే రక్షక దళం కానిస్టేబుల్‌ ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన ఇది. రైల్వే రక్షక దళం మహబూబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. తిరుపతి నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషనులోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారం పైకి వస్తుండగా ఓ మహిళ పట్టాలపైకి వెళ్లి నిలబడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుల్‌ కేఎం పూనమ్‌ ఆమెను పట్టాలపై నుంచి తప్పుకోవాలని ఎంత చెప్పినా వినలేదు.

Railway Constable Saved a Woman : దీంతో దూసుకొస్తున్న రైలుకు అడ్డంగా వెళ్లిన పూనమ్‌ ఆ మహిళను పక్కకు లాగేశారు. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే మోతీనగర్‌కు చెందిన ఆ మహిళ ఇంట్లో గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తేలింది. రైల్వే రక్షక దళం ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ బాధితురాలి కుమారులను పిలిచి ఆమెను అప్పగించారు. ఈ సందర్భంగా పూనమ్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలను రైల్వే అధికారులు మెచ్చుకున్నారు.

Railway Constable Rescued a Woman : రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను రైల్వే రక్షక దళం కానిస్టేబుల్‌ ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన ఇది. రైల్వే రక్షక దళం మహబూబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. తిరుపతి నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషనులోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారం పైకి వస్తుండగా ఓ మహిళ పట్టాలపైకి వెళ్లి నిలబడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుల్‌ కేఎం పూనమ్‌ ఆమెను పట్టాలపై నుంచి తప్పుకోవాలని ఎంత చెప్పినా వినలేదు.

Railway Constable Saved a Woman : దీంతో దూసుకొస్తున్న రైలుకు అడ్డంగా వెళ్లిన పూనమ్‌ ఆ మహిళను పక్కకు లాగేశారు. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే మోతీనగర్‌కు చెందిన ఆ మహిళ ఇంట్లో గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తేలింది. రైల్వే రక్షక దళం ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ బాధితురాలి కుమారులను పిలిచి ఆమెను అప్పగించారు. ఈ సందర్భంగా పూనమ్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలను రైల్వే అధికారులు మెచ్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.