ETV Bharat / crime

పహిల్వాన్​పురంలో వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : May 20, 2021, 9:50 AM IST

వలిగొండ మండలం పహిల్వాన్​పురం గ్రామంలో ఈనెల 17న జరిగిన హత్య కేసును వలిగొండ పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చరవాణులు, ద్విచక్ర వాహనం, గొడ్డలి స్వాధీనం చేసుకొని రిమాండ్​కి తరలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

Telangana news
యాదాద్రి వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురంలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. గ్రామ పరిధిలోని చిట్టబోయినబావికి చెందిన ఎలిమినేటి వెంకట్ రెడ్డిని ఈనెల 17న కిరాతకంగా హత్య చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ గొడవ

గ్రామానికి చెందిన వెంకట్​రెడ్డికి, ఎలిమినేటి సంజీవరెడ్డికి మధ్య 40 ఏళ్లుగా ఓ భూమి విషయంలో తగాదా ఉంది. ఈ వివాదంతో గతేడాది సంజీవ్​ రెడ్డిని వెంకట్​రెడ్డి గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో వెంకట్ రెడ్డి జైలుకు వెల్లివచ్చాడు. జైలు నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి సంజీవ్​ రెడ్డి పాలివారితో గొడవ పడుతుండేవాడు. తమను బెదిరిస్తున్న వెంకట్​ రెడ్డిని అంతం చేయాలని సంజీవ రెడ్డి పాలివారైన వెంకట్ రెడ్డి... జలంధర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, దామోదర్ రెడ్డితో కలిసి పధకం వేశారు.

ఈ నెల 17న వెంకట్ రెడ్డి గ్రామ సమీపంలోని బండరాళ్ల వద్ద ఉన్నాడని తెలుసుకుని... వీళ్లంతా వెళ్లి వెంకట్​ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు. మృతుడు వెంకట్​రెడ్డి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను మండలంలోని పులిగిల్లలో అదుపులో తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్​ఫోన్లు, ద్విచక్రవాహనం, దాడికి వినియోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. నిందితులను రిమాండ్​కి తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి: బ్లాక్​ మార్కెట్​కు ఔషధాలు.. ఇద్దరు వైద్యులు సహా ఐదుగురు అరెస్ట్​

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురంలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. గ్రామ పరిధిలోని చిట్టబోయినబావికి చెందిన ఎలిమినేటి వెంకట్ రెడ్డిని ఈనెల 17న కిరాతకంగా హత్య చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ గొడవ

గ్రామానికి చెందిన వెంకట్​రెడ్డికి, ఎలిమినేటి సంజీవరెడ్డికి మధ్య 40 ఏళ్లుగా ఓ భూమి విషయంలో తగాదా ఉంది. ఈ వివాదంతో గతేడాది సంజీవ్​ రెడ్డిని వెంకట్​రెడ్డి గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో వెంకట్ రెడ్డి జైలుకు వెల్లివచ్చాడు. జైలు నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి సంజీవ్​ రెడ్డి పాలివారితో గొడవ పడుతుండేవాడు. తమను బెదిరిస్తున్న వెంకట్​ రెడ్డిని అంతం చేయాలని సంజీవ రెడ్డి పాలివారైన వెంకట్ రెడ్డి... జలంధర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, దామోదర్ రెడ్డితో కలిసి పధకం వేశారు.

ఈ నెల 17న వెంకట్ రెడ్డి గ్రామ సమీపంలోని బండరాళ్ల వద్ద ఉన్నాడని తెలుసుకుని... వీళ్లంతా వెళ్లి వెంకట్​ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు. మృతుడు వెంకట్​రెడ్డి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను మండలంలోని పులిగిల్లలో అదుపులో తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్​ఫోన్లు, ద్విచక్రవాహనం, దాడికి వినియోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. నిందితులను రిమాండ్​కి తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి: బ్లాక్​ మార్కెట్​కు ఔషధాలు.. ఇద్దరు వైద్యులు సహా ఐదుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.