మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని... భగత్సింగ్నగర్లో కుమారున్ని కన్న తల్లే కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తల్లి ఉదయతో పాటు ఆమె ప్రియుడు భాస్కర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వివాహేత సంబంధానికి అడ్డు వస్తున్నాడని కొట్టి చంపినట్లు ఒప్పుకుందని చెప్పారు. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్కు... ఉదయతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఉమేష్ అనే కుమారుడు ఉన్నాడు. భాస్కర్ అనే మేస్త్రీ వద్ద సురేష్ పనికి వెళ్తుండేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో భాస్కర్తో ఉదయ సాన్నిహిత్యంగా మెలిగేది. గమనించిన భర్త... పలుమార్లు హెచ్చరించాడు.
కొన్ని రోజులకు కుమారుడు ఉమేష్(3)ను తీసుకుని భాస్కర్తో కలిసి వెళ్లిపోయింది. కుమారునితో కలిసి రెండేళ్లుగా భగత్సింగ్నగర్లో ఉదయ నివాసముంటోంది. తన కుమారుడిని చూడడానికి పలుమార్లు సురేష్... జగద్గిరిగుట్ట నుంచి భగత్సింగ్నగర్కు వచ్చేవాడు. కుమారుని కారణంగా సురేష్ పదే పదే తన ఇంటికి వస్తున్నాడన్న కోపంతో పిల్లాడిని కర్రతో తీవ్రంగా కొట్టింది. దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోయిన బాలున్ని... పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చివరకు సురారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు పేర్కొన్నారు.