ETV Bharat / crime

మరో 20 నిమిషాల్లో గమ్యం.. అంతలోనే ప్రమాదం - వ్యాను ప్రమాదంలో పూల వ్యాపారి మృతి

ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మరికొద్ది సేపట్లో గమ్యానికి చేరుకోవాల్సిన వ్యక్తి.. ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.

van accident at pallipadu
పల్లిపాడు వద్ద వ్యాన్​ బోల్తా
author img

By

Published : May 16, 2021, 2:09 PM IST

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు వద్ద టాటా ఏస్​ వ్యాను అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం పట్టణానికి చెందిన పూల వ్యాపారి రామారావు ఆంధ్రప్రదేశ్​లోని మైలవరం ప్రాంతానికి మల్లెపూల కోసం వ్యాన్​లో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పల్లిపాడు వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఘటనలో రామారావు వ్యానులోనే ఇరుక్కొని మృతి చెందారు. డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. 20 నిమిషాల్లో వారు గమ్యం చేరతారనగా.. రామారావు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు వద్ద టాటా ఏస్​ వ్యాను అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం పట్టణానికి చెందిన పూల వ్యాపారి రామారావు ఆంధ్రప్రదేశ్​లోని మైలవరం ప్రాంతానికి మల్లెపూల కోసం వ్యాన్​లో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పల్లిపాడు వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఘటనలో రామారావు వ్యానులోనే ఇరుక్కొని మృతి చెందారు. డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. 20 నిమిషాల్లో వారు గమ్యం చేరతారనగా.. రామారావు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి: రెమ్​డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.