ETV Bharat / crime

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు - annasagar bike accident

ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నాసాగర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

one died and two were injured in two bikes collide
one died and two were injured in two bikes collide
author img

By

Published : Mar 30, 2021, 10:49 PM IST



సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నాసాగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందోల్ మండలం చింతకుంటకు చెందిన సింగి రమేశ్​... పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై జోగిపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రమేశ్​ తలకు తీవ్రంగా గాయం కాగా.. అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో వాహనంపై వస్తున్న మన్సాన్​పల్లికి చెందిన గోపాల్​కు కాలు వీరగ్గా... ఇంకో వ్యక్తి రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 15 మందికి తీవ్రగాయాలు!



సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నాసాగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందోల్ మండలం చింతకుంటకు చెందిన సింగి రమేశ్​... పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై జోగిపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రమేశ్​ తలకు తీవ్రంగా గాయం కాగా.. అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో వాహనంపై వస్తున్న మన్సాన్​పల్లికి చెందిన గోపాల్​కు కాలు వీరగ్గా... ఇంకో వ్యక్తి రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 15 మందికి తీవ్రగాయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.