ETV Bharat / crime

murder: పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరికి వచ్చాడు.. మూడు రోజుల తర్వాత..

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Sep 3, 2021, 10:36 AM IST

Updated : Sep 3, 2021, 11:11 AM IST

murder: బ్రహ్మంగారిమఠంలో వృద్ధ దంపతుల హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు..?
murder: బ్రహ్మంగారిమఠంలో వృద్ధ దంపతుల హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు..?

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ కాలనీలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన తొరివేముల నాగయ్య, నాగమ్మ దంపతులను దగ్గరి బంధువే హత్య చేయడం సంచలనంగా మారింది. చాపాడు మండలం నాగులప్లలెకు చెందిన వీరయ్య నాలుగు రోజుల క్రితమే... తన పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరకు వచ్చాడు. మూడ్రోజులుగా బాగానే ఉన్న వీరయ్య.. గురువారం అర్ధరాత్రి పెద్దమ్మ, పెద్ద నాన్నలు నిద్రిస్తుండగా రాడ్డుతో వారి తలలు పగులగొట్టాడు. తీవ్ర గాయాలపాలైన నాగయ్య, నాగమ్మ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

తలుపులు తెరిచిన వాళ్లపైనా దాడి..

తెల్లవారుజామునే పాల కోసం వచ్చే నాగమ్మ ఎంతకీ రాకపోవడంతో... పాలు పోసేందుకు ఇంటి వద్దకు వెళ్లిన మహిళ తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది. ఎంతకీ వాళ్లు చప్పుడు చేయకపోవడం, తలుపులు తెరవకపోవడంతో.. స్థానికులను పిలిచి విషయం తెలిపింది. వారంతా కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా... లోపలే ఉన్న నిందితుడు వీరయ్య.. వీరిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. అనంతరం పారిపోతున్న వీరయ్యను వెంబడించి స్థానికులు పట్టుకున్నారు.

స్వయానా చెల్లెలి కొడుకే...

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు పాల్పడిన వీరయ్య... నాగ‌మ్మకు స్వ‌యానా చెల్లెలి కుమారుడు. వీరయ్య మాన‌సిక‌ ప‌రిస్థితి స‌రిగా లేని కార‌ణంగానే దారుణానికి ఒడిగ‌ట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూర‌ల్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Warangal Murders: 15 రోజుల ముందే ప్రణాళిక.. 5 కత్తులు.. ఆరుగురితో కలిసి ఘాతుకం

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ కాలనీలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన తొరివేముల నాగయ్య, నాగమ్మ దంపతులను దగ్గరి బంధువే హత్య చేయడం సంచలనంగా మారింది. చాపాడు మండలం నాగులప్లలెకు చెందిన వీరయ్య నాలుగు రోజుల క్రితమే... తన పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరకు వచ్చాడు. మూడ్రోజులుగా బాగానే ఉన్న వీరయ్య.. గురువారం అర్ధరాత్రి పెద్దమ్మ, పెద్ద నాన్నలు నిద్రిస్తుండగా రాడ్డుతో వారి తలలు పగులగొట్టాడు. తీవ్ర గాయాలపాలైన నాగయ్య, నాగమ్మ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

తలుపులు తెరిచిన వాళ్లపైనా దాడి..

తెల్లవారుజామునే పాల కోసం వచ్చే నాగమ్మ ఎంతకీ రాకపోవడంతో... పాలు పోసేందుకు ఇంటి వద్దకు వెళ్లిన మహిళ తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది. ఎంతకీ వాళ్లు చప్పుడు చేయకపోవడం, తలుపులు తెరవకపోవడంతో.. స్థానికులను పిలిచి విషయం తెలిపింది. వారంతా కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా... లోపలే ఉన్న నిందితుడు వీరయ్య.. వీరిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. అనంతరం పారిపోతున్న వీరయ్యను వెంబడించి స్థానికులు పట్టుకున్నారు.

స్వయానా చెల్లెలి కొడుకే...

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు పాల్పడిన వీరయ్య... నాగ‌మ్మకు స్వ‌యానా చెల్లెలి కుమారుడు. వీరయ్య మాన‌సిక‌ ప‌రిస్థితి స‌రిగా లేని కార‌ణంగానే దారుణానికి ఒడిగ‌ట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూర‌ల్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Warangal Murders: 15 రోజుల ముందే ప్రణాళిక.. 5 కత్తులు.. ఆరుగురితో కలిసి ఘాతుకం

Last Updated : Sep 3, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.