గత నెల 24న ఖమ్మం నగర శివారు గొల్లగూడెంకు చెందిన భద్రయ్య అనే వ్యక్తికి కరోనా వచ్చింది. దీనితో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రెమ్డెసివిర్ ఎక్కించాలని చెప్పి... ఒక ఇంజక్షన్కు 30వేలు తీసుకుని రెండు వేశారని మృతుడు కుమారుడు తెలిపారు.
ఇంజక్షన్లపై మందు పేరు తెల్ల స్టిక్కర్పై రాసి అతికించారు. అనుమానం వచ్చి ఆ ఇంజక్షన్ల వీడియో తీశాను. ఇంజక్షన్ వేసిన తర్వాత నా తండ్రికి సిరియస్ అయింది. వేరే ఆసుపత్రిలో చేర్చించాం. అయినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రిలో సరైన వైద్యం చేయలేదని.. కలెక్టర్కు ఫిర్యాదు చేశా. ఆయన ఆదేశాల మేరకు టూటౌన్లో కేసు నమోదు చేశాను. - మృతుడి కుమారుడు.
మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం