ఏపీకి చెందిన తెదేపా సీనియర్ నేత విష్ణువర్ధన్రెడ్డి కుమారుడు, కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్దకు చేరుకోగానే.. టైరు పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
రాజవర్థన్రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజవర్థన్రెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: