ETV Bharat / crime

మచిలీపట్నంలో అమానవీయ ఘటన.. మృతదేహాన్ని బైక్‌పై మార్చురీకి తరలింపు

author img

By

Published : Nov 7, 2022, 3:18 PM IST

​INHUMAN INCIDENT IN MACHILIPATNAM: ఏపీలో బాలుడి మృతదేహాన్ని బైక్​పై మార్చురీకి తరలిస్తున్న దృశ్యాలు ఆ ప్రాంత వాసుల్ని కంట తడి పెట్టించింది. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న నవీన్​ ఆదివారం మంగినపూడి బీచ్​కు వెళ్లి ఈత కొడుతూ సముద్రంలో మునిగిపోయాడు.

మచిలీపట్నంలో అమానవీయ ఘటన
మచిలీపట్నంలో అమానవీయ ఘటన

INHUMAN INCIDENT IN MACHILIPATNAM: మచిలీపట్నంలో ఓ బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సి రావడం అందర్నీ కలచివేసింది. బాలుడి మేనమామ తీవ్రంగా రోదిస్తూ బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గూడూరు ZP హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న నవీన్‌.. ఆదివారం మంగినపూడి బీచ్‌కు వెళ్లాడు.

అక్కడ ఈత కొడుతూ సముద్రంలో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత పెదపట్నం ఒడ్డుకు కొట్టుకువచ్చిన నవీన్ మృతదేహాన్ని.. బైక్‌పై మార్చురీకి తీసుకెళ్లినట్లు బాలుడి మేనమామ తెలిపారు. బీచ్‌ నుంచి మృతదేహం తరలించేందుకు అధికారులు స్పందించకపోవడం వల్లే బైక్‌పై తీసుకెళ్లామని చెప్పారు.

INHUMAN INCIDENT IN MACHILIPATNAM: మచిలీపట్నంలో ఓ బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సి రావడం అందర్నీ కలచివేసింది. బాలుడి మేనమామ తీవ్రంగా రోదిస్తూ బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గూడూరు ZP హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న నవీన్‌.. ఆదివారం మంగినపూడి బీచ్‌కు వెళ్లాడు.

అక్కడ ఈత కొడుతూ సముద్రంలో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత పెదపట్నం ఒడ్డుకు కొట్టుకువచ్చిన నవీన్ మృతదేహాన్ని.. బైక్‌పై మార్చురీకి తీసుకెళ్లినట్లు బాలుడి మేనమామ తెలిపారు. బీచ్‌ నుంచి మృతదేహం తరలించేందుకు అధికారులు స్పందించకపోవడం వల్లే బైక్‌పై తీసుకెళ్లామని చెప్పారు.

మచిలీపట్నంలో అమానవీయ ఘటన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.