ETV Bharat / crime

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలు.. నిందితుడి అరెస్టు - కర్నూలు వాసి అరెస్టు

ఏపీలోని కర్నూలుకు చెందిన పింజరి ఖాాజా అనే వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ 25 మంది నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

hyderabad ccs police arrested job cheater
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలు.. నిందితుడి అరెస్టు
author img

By

Published : Feb 18, 2021, 9:28 AM IST

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​కు చెందిన పింజరి ఖాజా... ఉన్నతాధికారుల పరిచయంతో ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు చేశాడు.

ఇలా 25 మంది నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో బాధితులు సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖాజాను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​కు చెందిన పింజరి ఖాజా... ఉన్నతాధికారుల పరిచయంతో ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు చేశాడు.

ఇలా 25 మంది నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో బాధితులు సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖాజాను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో కిలోన్నర బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.