ETV Bharat / crime

మునుగోడులో కలకలం.. కోమటిరెడ్డి స్వగ్రామానికి చెందిన యువకుడిపై కాల్పులు

author img

By

Published : Aug 4, 2022, 10:49 PM IST

Updated : Aug 5, 2022, 6:56 AM IST

Gun firing
లింగస్వామి

22:46 August 04

Gun firing: మునుగోడు మండలం సింగారం వద్ద కాల్పుల కలకలం

Gun firing: నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం వద్ద కాల్పుల కలకలం రేగింది. బైకుపై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా.. వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి(32) మునుగోడులో కూల్‌డ్రింక్స్‌, నీటి బాటిళ్లను విక్రయిస్తున్నారు. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ చేస్తూ బ్రహ్మణవెల్లంలలో ఉంటున్నారు. రోజు వారీగా దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిస్తోలుతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాల్పుల శబ్దాన్ని సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి విని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే లింగస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్‌ పడి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి కామినేని ఆసుపత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు డీఎస్పీకి చెప్పినట్టు సమాచారం.

ఇవీ చదవండి: కేసీఆర్ దమ్ముంటే నేరుగా యుద్ధం చేయ్.. చూసుకుందాం: ఈటల

దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్‌.. సుప్రీంలోనే 71వేలు..

22:46 August 04

Gun firing: మునుగోడు మండలం సింగారం వద్ద కాల్పుల కలకలం

Gun firing: నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం వద్ద కాల్పుల కలకలం రేగింది. బైకుపై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా.. వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి(32) మునుగోడులో కూల్‌డ్రింక్స్‌, నీటి బాటిళ్లను విక్రయిస్తున్నారు. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ చేస్తూ బ్రహ్మణవెల్లంలలో ఉంటున్నారు. రోజు వారీగా దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిస్తోలుతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాల్పుల శబ్దాన్ని సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి విని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే లింగస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్‌ పడి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి కామినేని ఆసుపత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు డీఎస్పీకి చెప్పినట్టు సమాచారం.

ఇవీ చదవండి: కేసీఆర్ దమ్ముంటే నేరుగా యుద్ధం చేయ్.. చూసుకుందాం: ఈటల

దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్‌.. సుప్రీంలోనే 71వేలు..

Last Updated : Aug 5, 2022, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.