గ్యాస్ లీకై నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పారిశ్రామికవాడలోని ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలో జరిగింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలోని ఒక కార్మికుడు వెల్డింగ్ చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి మర్చిపోయాడు. కాసేపటికి మరో కార్మికుడు సిలిండర్ని వెలిగించటానికి ప్రయత్నించగా... వెంటనే మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేస్తున్న కార్మికులు మీసాల పాండరి, నరసింహ, రవి, ధరమ్ సింగ్లు తీవ్రంగా గాయపడ్డారు.
పారిశ్రామికవాడలోని తోటి కార్మికులు చికిత్స నిమిత్తం వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉప్పల్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పాండరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన బీబీ నగర్ ఎస్ఐ రాఘవేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్: సీపీ