కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్లాంట్లోని జీ-బ్లాక్ పూర్తిగా దగ్ధం అయ్యింది.
ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందని ప్లాంట్ పర్యవేక్షణ అధికారులు తెలిపారు. సోలార్ ప్లాంట్ పక్కన గడ్డికి నిప్పు పెట్టారు. గాలి వేగం వల్ల ప్లాంట్లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవీచూడండి: షాద్నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం