ETV Bharat / crime

Road accident: అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి

author img

By

Published : Dec 11, 2021, 4:23 PM IST

Updated : Dec 11, 2021, 5:20 PM IST

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి

16:20 December 11

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై బైకును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో విజ్ఞాన్‌ కళాశాలలో చదువుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అనంతరం రోడ్డు పక్కనున్న ఆలయ ప్రహరీని ఢీకొట్టి లారీ నిలిచిపోయింది. మృతుడు సిరిసిల్లలోని ప్రగతి నగర్​కు చెందిన ప్రణయ్​ గౌడ్​గా గుర్తించారు. ప్రణయ్​ విజ్ఞాన్​ కళాశాలలో ఇంజినీరింగ్​ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

లారీ రూపంలో వచ్చిన మృత్యువు ప్రణయ్​ ప్రాణాలను బలితీసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

missing boys found alive : అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం.. అసలేమైందంటే?

16:20 December 11

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై బైకును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో విజ్ఞాన్‌ కళాశాలలో చదువుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అనంతరం రోడ్డు పక్కనున్న ఆలయ ప్రహరీని ఢీకొట్టి లారీ నిలిచిపోయింది. మృతుడు సిరిసిల్లలోని ప్రగతి నగర్​కు చెందిన ప్రణయ్​ గౌడ్​గా గుర్తించారు. ప్రణయ్​ విజ్ఞాన్​ కళాశాలలో ఇంజినీరింగ్​ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

లారీ రూపంలో వచ్చిన మృత్యువు ప్రణయ్​ ప్రాణాలను బలితీసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

missing boys found alive : అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం.. అసలేమైందంటే?

Last Updated : Dec 11, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.