ETV Bharat / crime

ట్రాన్స్​ఫార్మర్​ను పట్టుకున్న చిన్నారి... ప్రాణభిక్ష పెట్టాలంటున్న తల్లి - telangana latest news

విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్ల స్నేహితులతో ఆడుకోవాల్సిన ఎనిమిదేళ్ల బాలుడు ఆస్పత్రి పడకపై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఓ అపార్టుమెంట్​ వద్ద ఉన్న ట్రాన్స్​ఫార్మర్​కు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల.. దాన్ని ప్రమాదవశాత్తు తాకిన బాలుడు ఆస్పత్రి పాలయ్యాడు. తన బిడ్డను రక్షించుకునేందుకు ఆ బాలుడు తల్లి దాతల సాయం కోసం వేడుకొంది. ఈ ఘటనపై ట్విట్టర్​ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్​.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.

eight years boy got electric shock
ట్రాన్స్​ఫార్మర్​ను పట్టుకున్న చిన్నారి... ప్రాణబిక్ష పెట్టాలంటున్న తల్లి
author img

By

Published : Apr 11, 2021, 1:21 PM IST

Updated : Apr 11, 2021, 2:00 PM IST

విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఎనిమిదేళ్ల బాలుడికి ప్రాణాపాయ పరిస్థితిని తీసుకొచ్చింది. ట్రాన్స్​ఫార్మర్​కు తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం దానికి తాకిన పిల్లాడికి తీవ్రగాయాలయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడి నరకయాతనను కళ్లారా చూడలేక.. బాగుచేసుకొనే ఆర్థిక స్తోమత లేక కన్నీటిపర్యంతమవుతోంది ఆ మాతృమూర్తి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి ఈస్ట్ మారుతినగర్​లోని ఎమ్మార్ హోమ్స్ అపార్ట్​మెంట్​లో.. జానకి.. తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటోంది. అందులో ఎనిమిదేళ్ల నిశాంత్​.. శనివారం మధ్నాహ్నం ఆడుకునేందుకు అపార్ట్​మెంట్​లోని ఖాళీ స్థలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాన్స్​ఫార్మర్​కు తాకి తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు 48 గడిస్తేనే ఆరోగ్య స్థితిపై స్పష్టత ఇవ్వగలుగుతామని చెప్పారంటూ ఆ బాలుడు తల్లి కన్నీటిపర్యంతం అయింది. తనలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావొద్దని.. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. బాలుడు తల్లి జానికి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

'శనివారం మధ్యాహ్నం ఆదుకుంటానంటా బయటకు వెళ్లాడు. అపార్ట్​మెంట్​ బయట రోడ్డుకు ఆనుకొని ఒక ట్రాన్స్​ఫార్మర్​ ఉంది. ప్రమాదవశాత్తు దానికి తాకి తీవ్రగాయాలపాలయ్యాడు. నా పిల్లాడికి జరిగినట్లు ఇంకెవరికీ జరగొద్దు. అధికారులు తక్షణమే.. ట్రాన్స్​ఫార్మర్​ చుట్టూ కంచె ఏర్పాటుచేయాలి. తన బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాబు తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుడిని కాపాడుకొనేందుకు నా ఆర్థిక స్తోమత సరిపోదు. దాతలు ఎవరైన ఆదుకుంటేనే బాబును కాపాడుకోగలను.'

- జానకి, బాలుడి తల్లి

ట్రాన్స్​ఫార్మర్​ను పట్టుకున్న చిన్నారి... ప్రాణబిక్ష పెట్టాలంటున్న తల్లి

స్పందించిన కేటీఆర్​..

ఈ ఘటనపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. బాధిత కుటుంబాన్ని సంప్రదించి.. తగిన సాయం చేయాలని తన కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు.

ఇవీచూడండి: క్యాన్సర్​తో బాధపడుతున్న బాలుడి చికిత్సకు సర్పంచ్​ సాయం

విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఎనిమిదేళ్ల బాలుడికి ప్రాణాపాయ పరిస్థితిని తీసుకొచ్చింది. ట్రాన్స్​ఫార్మర్​కు తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం దానికి తాకిన పిల్లాడికి తీవ్రగాయాలయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడి నరకయాతనను కళ్లారా చూడలేక.. బాగుచేసుకొనే ఆర్థిక స్తోమత లేక కన్నీటిపర్యంతమవుతోంది ఆ మాతృమూర్తి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి ఈస్ట్ మారుతినగర్​లోని ఎమ్మార్ హోమ్స్ అపార్ట్​మెంట్​లో.. జానకి.. తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటోంది. అందులో ఎనిమిదేళ్ల నిశాంత్​.. శనివారం మధ్నాహ్నం ఆడుకునేందుకు అపార్ట్​మెంట్​లోని ఖాళీ స్థలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాన్స్​ఫార్మర్​కు తాకి తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు 48 గడిస్తేనే ఆరోగ్య స్థితిపై స్పష్టత ఇవ్వగలుగుతామని చెప్పారంటూ ఆ బాలుడు తల్లి కన్నీటిపర్యంతం అయింది. తనలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావొద్దని.. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. బాలుడు తల్లి జానికి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

'శనివారం మధ్యాహ్నం ఆదుకుంటానంటా బయటకు వెళ్లాడు. అపార్ట్​మెంట్​ బయట రోడ్డుకు ఆనుకొని ఒక ట్రాన్స్​ఫార్మర్​ ఉంది. ప్రమాదవశాత్తు దానికి తాకి తీవ్రగాయాలపాలయ్యాడు. నా పిల్లాడికి జరిగినట్లు ఇంకెవరికీ జరగొద్దు. అధికారులు తక్షణమే.. ట్రాన్స్​ఫార్మర్​ చుట్టూ కంచె ఏర్పాటుచేయాలి. తన బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాబు తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుడిని కాపాడుకొనేందుకు నా ఆర్థిక స్తోమత సరిపోదు. దాతలు ఎవరైన ఆదుకుంటేనే బాబును కాపాడుకోగలను.'

- జానకి, బాలుడి తల్లి

ట్రాన్స్​ఫార్మర్​ను పట్టుకున్న చిన్నారి... ప్రాణబిక్ష పెట్టాలంటున్న తల్లి

స్పందించిన కేటీఆర్​..

ఈ ఘటనపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. బాధిత కుటుంబాన్ని సంప్రదించి.. తగిన సాయం చేయాలని తన కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు.

ఇవీచూడండి: క్యాన్సర్​తో బాధపడుతున్న బాలుడి చికిత్సకు సర్పంచ్​ సాయం

Last Updated : Apr 11, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.