ETV Bharat / crime

ఏడుగురుని పొట్టన పెట్టుకున్న ముగ్గురి నిర్లక్ష్యం - నిర్లక్ష్యంగా వాహనం నడిపిన పోలీసులు

శంషాబాద్​ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. నిన్న ఆరుగురు మృతి చెందగా... ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఇవాళ మరో యువకుడు ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాదాపూర్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న గిరిప్రసాద్​గా పోలీసులు గుర్తించారు.

accident
samshabad
author img

By

Published : Apr 19, 2021, 3:26 PM IST

శంషాబాద్​ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో మరో యువకుడు మృతి చెందాడు. నిన్న ఆరుగురు మృతి చెందగా... ఉస్మానియాలో చికిత్స పొందుతున్న భూదాన్ ప్రాణాలు విడిచాడు. మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మాదాపూర్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న గిరిప్రసాద్​గా గుర్తించారు.

ఇదీ జరిగింది..

మాదాపూర్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న​ గిరిప్రసాద్​... అదే స్టేషన్​లో హోంగార్డ్​గా విధులు నిర్వహిస్తున్న సంగమేశ్వర్, మరో స్నేహితుడు మల్లేశ్​తో కలిసి ఆదివారం ఉదయం కారులో యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓఆర్​ఆర్​ మీదుగా శంషాబాద్​కి వచ్చిన ముగ్గురు... ఓ వెంచర్ వద్ద మద్యం సేవించారు. అనంతరం రోడ్డు పైకి వచ్చిన కారు... అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఘటనలో లారీలో ఉన్న కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. తాజాగా మరో వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

కానిస్టేబుల్ గిరిప్రసాద్​ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కి తరలించనున్నారు. ప్రమాదానికి కారణమైన కారుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు చలాన్ గుర్తించారు. ముగ్గురికి పరీక్షలు నిర్వహించగా... హోంగార్డు మద్యం సేవించినట్లు... గిరిప్రసాద్ మద్యం సేవించనట్లు వచ్చింది. అందువల్ల అతని రక్త నమూనాలను ల్యాబ్​కు పంపారు.

ఇదీ చూడండి: శంషాబాద్​లో​ ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

శంషాబాద్​ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో మరో యువకుడు మృతి చెందాడు. నిన్న ఆరుగురు మృతి చెందగా... ఉస్మానియాలో చికిత్స పొందుతున్న భూదాన్ ప్రాణాలు విడిచాడు. మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మాదాపూర్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న గిరిప్రసాద్​గా గుర్తించారు.

ఇదీ జరిగింది..

మాదాపూర్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న​ గిరిప్రసాద్​... అదే స్టేషన్​లో హోంగార్డ్​గా విధులు నిర్వహిస్తున్న సంగమేశ్వర్, మరో స్నేహితుడు మల్లేశ్​తో కలిసి ఆదివారం ఉదయం కారులో యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓఆర్​ఆర్​ మీదుగా శంషాబాద్​కి వచ్చిన ముగ్గురు... ఓ వెంచర్ వద్ద మద్యం సేవించారు. అనంతరం రోడ్డు పైకి వచ్చిన కారు... అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఘటనలో లారీలో ఉన్న కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. తాజాగా మరో వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

కానిస్టేబుల్ గిరిప్రసాద్​ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కి తరలించనున్నారు. ప్రమాదానికి కారణమైన కారుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు చలాన్ గుర్తించారు. ముగ్గురికి పరీక్షలు నిర్వహించగా... హోంగార్డు మద్యం సేవించినట్లు... గిరిప్రసాద్ మద్యం సేవించనట్లు వచ్చింది. అందువల్ల అతని రక్త నమూనాలను ల్యాబ్​కు పంపారు.

ఇదీ చూడండి: శంషాబాద్​లో​ ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.