ETV Bharat / crime

ఆవుల మందపై పులి దాడి.. ఘటనలో ఓ ఆవు మృతి

author img

By

Published : May 24, 2021, 12:34 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక ఆవు మృతి చెందింది.

cow died in tiger attack
ఆవుల మందపై పులి దాడి.. ఘటనలో ఓ ఆవు మృతి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండెపల్లి గ్రామ సమీపంలో ఆదివారం పశువులు మేత మేస్తున్నాయి. పొదల మాటున దాగున్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. పులిని చూసి బెదిరిపోయిన మిగతా ఆవులన్నీ పారిపోయాయి.

మృతి చెందిన ఆవు గుండెపల్లి గ్రామానికి చెందిన మాడావి తిరుపతికి చెందినదిగా గుర్తించారు. గ్రామ సమీపంలో పులి దాడి జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండెపల్లి గ్రామ సమీపంలో ఆదివారం పశువులు మేత మేస్తున్నాయి. పొదల మాటున దాగున్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. పులిని చూసి బెదిరిపోయిన మిగతా ఆవులన్నీ పారిపోయాయి.

మృతి చెందిన ఆవు గుండెపల్లి గ్రామానికి చెందిన మాడావి తిరుపతికి చెందినదిగా గుర్తించారు. గ్రామ సమీపంలో పులి దాడి జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.