ETV Bharat / crime

బ్లాక్​లో కొవిఫోర్​ విక్రయం.. నిందితులు అరెస్ట్​

author img

By

Published : Apr 30, 2021, 7:21 PM IST

కొవిడ్‌ బాధితులకు ఉపయోగపడే ఇంజక్షన్లతో బ్లాక్​ మార్కెటింగ్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ఇంజక్షన్​ను రూ.35వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.

corona medicines selling in black marketing
బ్లాక్​ మార్కెటింగ్​లో కరోనా మందుల విక్రయం

కొవిడ్‌ బాధితులకు ఉపయోగపడే ఇంజక్షన్ల బ్లాక్​ మార్కెటింగ్​ జోరుగా సాగుతోంది. కొవిఫోర్​ ఇంజక్షన్​ను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రాం చందర్‌, కోలమ కార్తిక్‌, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని మెడికల్​ దుకాణం యాజమాని శీను కలిసి బ్లాక్​లో విక్రయిస్తున్నారు.

ఒక్కో ఇంజక్షన్​ను​ ఎంఆర్​పీ ధర రూ.3,490కి కొనుగోలు చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు రూ.35 వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు మేడిపల్లి సీఐ బి.అంజిరెడ్డి తెలిపారు. వారి నుంచి మూడు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

కొవిడ్‌ బాధితులకు ఉపయోగపడే ఇంజక్షన్ల బ్లాక్​ మార్కెటింగ్​ జోరుగా సాగుతోంది. కొవిఫోర్​ ఇంజక్షన్​ను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రాం చందర్‌, కోలమ కార్తిక్‌, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని మెడికల్​ దుకాణం యాజమాని శీను కలిసి బ్లాక్​లో విక్రయిస్తున్నారు.

ఒక్కో ఇంజక్షన్​ను​ ఎంఆర్​పీ ధర రూ.3,490కి కొనుగోలు చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు రూ.35 వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు మేడిపల్లి సీఐ బి.అంజిరెడ్డి తెలిపారు. వారి నుంచి మూడు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్‌ వినియోగానికి అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.