ETV Bharat / crime

దంపతులపై కూలిన సెల్ టవర్.. భర్త మృతి - ఏపీ నేర వార్తలు

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జంటపై సెల్‌ టవర్‌ కూలి పడింది. ఈదురు గాలులతో టవర్‌ కూలినట్లు స్థానికులు తెలిపారు.

ap crime news, cell tower
cell tower, west godavari
author img

By

Published : Apr 5, 2021, 10:44 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు పోలీస్ స్టేషన్‌ కూడలి వద్ద నిరుపయోగంగా ఉన్న సెల్ టవర్ కూలిపోయింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న బొట్టా రాజేశ్‌ (45) అక్కడికక్కడే మృతిచెందగా.. రాణి అనే మహిళకు రెండు కాళ్లూ విరిగిపోయాయి.

తాడేపల్లిగూడెం కోర్టు, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. క్షతగాత్రురాలిని సమీపంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు పోలీస్ స్టేషన్‌ కూడలి వద్ద నిరుపయోగంగా ఉన్న సెల్ టవర్ కూలిపోయింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న బొట్టా రాజేశ్‌ (45) అక్కడికక్కడే మృతిచెందగా.. రాణి అనే మహిళకు రెండు కాళ్లూ విరిగిపోయాయి.

తాడేపల్లిగూడెం కోర్టు, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. క్షతగాత్రురాలిని సమీపంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.