ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నిరుపయోగంగా ఉన్న సెల్ టవర్ కూలిపోయింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న బొట్టా రాజేశ్ (45) అక్కడికక్కడే మృతిచెందగా.. రాణి అనే మహిళకు రెండు కాళ్లూ విరిగిపోయాయి.
తాడేపల్లిగూడెం కోర్టు, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. క్షతగాత్రురాలిని సమీపంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి