ETV Bharat / crime

C Kalyan: స్థల వివాదంలో ప్రముఖ నిర్మాత... మరో ముగ్గురిపై కేసు

author img

By

Published : Jun 29, 2021, 2:29 PM IST

ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్‌(C Kalyan)తో పాటు మరో ముగ్గురిపై హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ ప్రవాస భారతీయ వైద్యునికి చెందిన స్థలాన్ని ఆక్రమించారని... గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

case registered against producer c kalyan
ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్

స్థలంలో వివాదంలో ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్​(C Kalyan)పై కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ వైద్యుడు స్వరూప్‌... 1985లో షేక్‌పేటలో ఉన్న 634గజాల స్థలాన్ని... ఫిలింనగర్‌ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం తన సోదరుడు గోపీకృష్ణ పేరుతో జీపీఏ(GPA) చేయించాడు. ఈ స్థలాన్ని 2015లో నారాయణ మూర్తి అనే వ్యక్తికి అద్దెకు ఇవ్వగా.. అక్కడ ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శ్రీకాంత్‌, తేజస్వీ, షరీఫ్‌ అనే ముగ్గరు అక్రమంగా ప్రవేశించి దానికి తాళాలు వేశారు. సినీ నిర్మాత కళ్యాణ్‌ సూచనల మేరకే ఈ పని చేసినట్లు ఆ ముగ్గురు తెలిపారని.. గోపీకృష్ణ బంజారాహిల్స్​ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వివరించారు. పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్థలంలో వివాదంలో ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్​(C Kalyan)పై కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ వైద్యుడు స్వరూప్‌... 1985లో షేక్‌పేటలో ఉన్న 634గజాల స్థలాన్ని... ఫిలింనగర్‌ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం తన సోదరుడు గోపీకృష్ణ పేరుతో జీపీఏ(GPA) చేయించాడు. ఈ స్థలాన్ని 2015లో నారాయణ మూర్తి అనే వ్యక్తికి అద్దెకు ఇవ్వగా.. అక్కడ ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శ్రీకాంత్‌, తేజస్వీ, షరీఫ్‌ అనే ముగ్గరు అక్రమంగా ప్రవేశించి దానికి తాళాలు వేశారు. సినీ నిర్మాత కళ్యాణ్‌ సూచనల మేరకే ఈ పని చేసినట్లు ఆ ముగ్గురు తెలిపారని.. గోపీకృష్ణ బంజారాహిల్స్​ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వివరించారు. పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: GHMC: తొలిసారి సమావేశమైన బల్దియా.. వార్షిక పద్దుపై సమగ్ర చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.